వైసిపి లోనే ఉంటూ ఆ పార్టీని ... ఆ పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ఏకైక ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు. గత ఏడాదిన్నర కాలంగా వైసీపీలో రెబెల్ నేతగా కొనసాగుతూ వస్తున్న ఆయన ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోతున్నారు. ప్రతి విషయంలో జగన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ఆయనకు కంట్లో న‌లుసులా మారారు. తాను జీవితంలో ఎవరితోనూ దెబ్బలు తినలేదని ... అలాంటిది పోలీసుతో తాను దెబ్బలు తినేలా చేశారు జగన్ అంటూ రఘురామా హాట్ కామెంట్లు చేశారు.

రఘురామ కృష్ణంరాజు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు ఎంత హైలెట్ చేస్తాయో తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన తాజా ఏబీఎన్‌ ఇంటర్వ్యూలో జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో పూర్తిగా మారిపోయారని... తాను ఎలా ? ఉన్నా చిన్న పిల్లలను దగ్గరకు తీసుకున్నారని ప్రశాంత్ కిషోర్ తనతో చెప్పారని.. అతని మాయ మాటలు నమ్మి తన మళ్లీ జగన్ టీం లోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ క్రమంలోనే రఘు రామ కాలు జారాం .. కడుపు అయిందని అనగానే ... ఆయన ను ఇంటర్వ్యూ చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ కడుపు అవలేదు ... కాళ్లు వచ్చాయి అని పంచ్‌ వేశారు. అనంతరం ర‌ఘురామ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే సినిమాల్లో ఫైటింగ్ సీన్లు చూస్తూనే భయమేసేది అని... తాను జీవితంలో ఎవరితోనూ దెబ్బలు తిన‌ లేదని ... అలాంటి మొదటిసారిగా తన ఒంటిపై పోలీసులు వారి ప్రతాపాన్ని చూపించారు అని ఆవేదనతో చెప్పారు.

ఇక ప్రధానమంత్రి మోడీ తో తనకు అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే... ముఖ్యమంత్రి జగన్ లా కాళ్ళరిగేలా తిరగాల్సిన అవసరం లేదని... సీఎం ప్రాధేయపడినంతగా తాను శ్రమ పడాల్సిన అవసరం లేదని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: