ఇక రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని అంటూ సేవ్ అమరావతి పేరుతో న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. నాలుగు జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర... చివరికి తిరుమలేశుని దర్శనంతో ముగిసింది. ఆ తర్వాత తిరుపట్టి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు రైతులు. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలు మినహా.... మిగిలిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరయ్యారు. అదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ కూడా సభకు హాజరయ్యారు. ఈ సభ ప్రాంగణంపైకి చేరుకున్న రఘురామకు రైతులు ఘన స్వాగతం పలికారు. అటు రఘురామ కూడా తన ప్రసంగంలో జై అమరావతి అంటూ రైతులకు మద్దతు తెలిపారు. అమరావతిని రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాగానే... ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు దగ్గరకు నేరుగా వెళ్లిన రఘురామ.. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. సభ మొత్తానికి ఇదే హైలెట్ సీన్.
ఇక రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని అంటూ సేవ్ అమరావతి పేరుతో న్యాయ స్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర చేపట్టారు అమరావతి ప్రాంత రైతులు. నాలుగు జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర... చివరికి తిరుమలేశుని దర్శనంతో ముగిసింది. ఆ తర్వాత తిరుపట్టి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు రైతులు. ఈ సమావేశానికి అధికార పార్టీ నేతలు మినహా.... మిగిలిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరయ్యారు. అదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ ఆర్ఆర్ఆర్ కూడా సభకు హాజరయ్యారు. ఈ సభ ప్రాంగణంపైకి చేరుకున్న రఘురామకు రైతులు ఘన స్వాగతం పలికారు. అటు రఘురామ కూడా తన ప్రసంగంలో జై అమరావతి అంటూ రైతులకు మద్దతు తెలిపారు. అమరావతిని రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు వేదికపైకి రాగానే... ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు దగ్గరకు నేరుగా వెళ్లిన రఘురామ.. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. సభ మొత్తానికి ఇదే హైలెట్ సీన్.