అనంతపురం జిల్లా రూరల్ మండలం నందమూరి నగర్ కు చెందిన రాజేష్ కు సుజాత అనే మహిళతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బేల్దారి పని చేసే రాజేష్ కు స్థానిక సుందరయ్య కాలనీకి చెందిన గురుమూర్తి, బాలరాజు ఫ్రెండ్స్ అయితే ఇటీవలే రాజేష్ స్నేహితుడు గురుమూర్తి కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు ఇక స్నేహితుడు కావడంతో రాజేష్ ఈ పనులన్నింటినీ దగ్గరుండి బాధ్యత తీసుకొని పూర్తి చేయించాడు. ఈ క్రమంలోనే గురుమూర్తి భార్యతో రాజేష్కు పరిచయం ఏర్పడింది.. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ క్రమంలోనే గురుమూర్తి తెలియకుండా రాజేష్ గురుమూర్తి భార్య తో రాసలీలలు సాగిస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు అసలు నిజం బయటపడింది. దీంతో ఇక స్నేహితులిద్దరూ ఈ విషయంపై గొడవపడ్డారు. పద్ధతి మార్చుకోవాలని తన భార్యను కూడా హెచ్చరించాడు గురుమూర్తి. అయితే ఎంత చెప్పినా స్నేహితుడు రాజేష్ తీరులో మార్పు రాకపోవడంతో ఇక అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పక్క ప్లాన్ వేసి ఇక స్నేహితుని మద్యం తాగుదాం అంటూ బైక్పై ఎక్కించుకుని వెళ్లి ఫుల్లుగా మద్యం తాగి దారుణంగా హత్య చేశాడు. అయితే ఎంతకి భర్త ఇంటికి రాకపోవడంతో గురుమూర్తి భార్య ప్రియుడు రాజేష్ కి ఫోన్ చేయగా నీ భర్తతో కలిసి తాగుతున్నాను అంటూ సమాధానం చెప్పాడు. చివరికి గురుమూర్తి రాజేష్ ను హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురుమూర్తి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.