అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కూడా. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పేర్లు మంత్రుల జాబితాలో విస్తృతంగా ప్రచారం జరిగింది కూడా. కానీ అనూహ్యంగా రోజాను పక్కన పెట్టారు వైఎస్ జగన్. రెండో విడతలో తప్పకుండా అవకాశం వస్తుందని కూడా చెప్పేశారు. అదే సమయంలో ఏపీఐఐసీ ఛైర్మన్గా రోజాకు అవకాశం కల్పించారు కూడా. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. రెండో విడతలో ఖాయమని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. నగరిలో హ్యాట్రిక్ విజయం ఖాయమని రోజా వర్గం భావిస్తుంటే... పార్టీలో మాత్రం మరో రకమైన ప్రచారం జరుగుతోంది. నగరిలో రోజా పట్టుకోల్పోయినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చింది. ఇందుకు ప్రధానంగా పార్టీ కార్యక్రమాల కంటే కూడా... ఇతర వ్యాపకాలపై రోజా ఎక్కువగా ఫోకస్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా నిరసనలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వివాదంలో ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి మరి.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు కూడా. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పేర్లు మంత్రుల జాబితాలో విస్తృతంగా ప్రచారం జరిగింది కూడా. కానీ అనూహ్యంగా రోజాను పక్కన పెట్టారు వైఎస్ జగన్. రెండో విడతలో తప్పకుండా అవకాశం వస్తుందని కూడా చెప్పేశారు. అదే సమయంలో ఏపీఐఐసీ ఛైర్మన్గా రోజాకు అవకాశం కల్పించారు కూడా. ఇక ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. రెండో విడతలో ఖాయమని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సమీకరణాలు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. నగరిలో హ్యాట్రిక్ విజయం ఖాయమని రోజా వర్గం భావిస్తుంటే... పార్టీలో మాత్రం మరో రకమైన ప్రచారం జరుగుతోంది. నగరిలో రోజా పట్టుకోల్పోయినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మార్పు వచ్చింది. ఇందుకు ప్రధానంగా పార్టీ కార్యక్రమాల కంటే కూడా... ఇతర వ్యాపకాలపై రోజా ఎక్కువగా ఫోకస్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా నిరసనలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వివాదంలో ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి మరి.