అయితే మళ్ళీ గెలవాలన్న పట్టుదల మాత్రం ఇంకా అలానే ఉండిపోయింది. అందుకోసమే బాబోరు కొత్త కొత్త ప్రణాళికలకు పదును పెడుతూ తెలుగు తమ్ముళ్లలో మళ్ళీ ఆశలు రేకెత్తిస్తున్నాడు. అందులో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భునేశ్వరిని రంగంలోకి దించారు. ఇటీవల ఈమెపై అసెంబ్లీ వేదికగా వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత విమర్శల కారణంగా రాష్ట్రము ఉడుకెక్కింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. అయితే ఇదే పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లి తనకు మరింత మద్దతును పెంచుకుని టీడీపీ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వరుస పర్యటనలు చేస్తూ వైసీపీపై విమర్శలు చేస్తూ వెళుతున్నారు భువనేశ్వరి. ఈ రోజు తిరుపతిలో భువనేశ్వరి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పరిణామాలను బట్టి టీడీపీ కి తర్వాత దిక్కు భువనేశ్వరి అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ, జరుగుతున్న సంఘటనలు అలానే ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్ ల వల్ల కానిది భువనేశ్వరి వల్ల అవుతుందా. మరి ఏమి జరగనుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.