ఒకప్పుడు కాశ్మీర్ భాగం భారతదేశంలో భాగమైనప్పటికీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రాంతం గానే ఉండేది. ఈ క్రమంలోనే ఇక ఎన్నో దశాబ్దాలుగా పాకిస్తాన్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది అనే విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో అమలులో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేయడం సంచలనం గా మారిపోయింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భారత చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే 370 ఆర్టికల్ రద్దు చేయడమే కాదు ఇక కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతాల్లో సైతం మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు పెడుతూ ఉంది భారత ప్రభుత్వం.


 ఒకప్పుడు పాకిస్థాన్ ప్రభావం  కాశ్మీర్ ప్రజలపై ఎక్కువగా ఉండేది. దీంతో ఎంతో మంది యువత ఉగ్రవాదాన్ని ఉపాధిగా ఎంచుకునే వారు.  కానీ 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడి యువతలో కూడా ఎంతగానో మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే యువత అందరికీ కూడా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత ప్రభుత్వం ముందడుగు వేస్తోంది అని చెప్పాలి. దేశవ్యాప్తంగా రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఎస్సీ, ఎస్టి రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాలలో కూడా అమలులో ఉన్నాయి. కానీ మొన్నటి వరకు 370 ఆర్టికల్ అమలులో ఉండటంతో అటు కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలులో లేవు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో సర్వే నిర్వహించడం కోసం ఒక కమిటీని కూడా నియమించారు.


 ఇలా కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం వేసిన కమిటీ అటు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్లో 43  కాశ్మీర్లో 47 నియోజకవర్గాలను విభజించి నట్లుగా ఈ నివేదిక చెప్పింది. అదే సమయంలో ఇక ఎస్సీ ఎస్టీ నివేదికను కూడా వెల్లడించారు. అయితే 9 సీట్లు అటు ఎస్సీ లకు రిజర్వేషన్ ఉండగా.. 7 సీట్లు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. ఇలా కాశ్మీర్లో మరికొన్ని రోజుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: