అయితే సరిగ్గా ఎన్నికల ఏడాది ప్రారంభం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యవహారం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో సిద్ధు వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరికి అధిష్ఠానం జోక్యం చేసుకుని రాజీ చేసింది. కానీ సిద్ధు తీరుతో విసిగిపోయిన కెప్టెన్ అమరీందర్ సింగ్... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అటు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీపై కూడా సిద్ధు పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాణా గుర్మీత్ సోధీ కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితంగా మెలిగే సోధీ... పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీరుపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో హస్తం పార్టీ గెలుపు కష్టమే అని కూడా వ్యాఖ్యానించారు సోధీ.
అయితే సరిగ్గా ఎన్నికల ఏడాది ప్రారంభం నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యవహారం పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ముందుగా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో సిద్ధు వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరికి అధిష్ఠానం జోక్యం చేసుకుని రాజీ చేసింది. కానీ సిద్ధు తీరుతో విసిగిపోయిన కెప్టెన్ అమరీందర్ సింగ్... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అటు ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీపై కూడా సిద్ధు పలు మార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాణా గుర్మీత్ సోధీ కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు అత్యంత సన్నిహితంగా మెలిగే సోధీ... పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తీరుపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో హస్తం పార్టీ గెలుపు కష్టమే అని కూడా వ్యాఖ్యానించారు సోధీ.