తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు మ‌రియు తెలుగు దేశం పార్టీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మూడేళ్లలో 1.50 లక్షల కోట్లను సంక్షేమం కోసం జగన్ సర్కార్ వెచ్చించిందని..   చంద్రబాబు హయాంలో క్రైస్తవులపై దాడు లు జరిగాయని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు.  గుంటూరు జిల్లాలో  దళితులపై దాడి జరగలేదని... కులాలు వర్గాల మ ధ్య  చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.  ఓటీఎస్ వల్ల ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయని... ఓటీ ఎస్ పై తెదేపా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు అంబటి రాంబాబు.  

చంద్రబాబు మాటల్ని ప్రజలు ఎవరూ విశ్వ సించడం లేదని..  తన హయాంలో ఇళ్ల  రుణాలను ఎందుకు మాఫీ చయలేదో చంద్రబాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. ఇష్టం ఉన్నవారు ఓటీఎస్ కోసం ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని..  ఓటీఎస్ లో బలవంతం ఏమీ లేదని చెప్పారు అంబటి రాంబాబు.  రాష్టానికి హోదా కావాలని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ డిమాండ్ చేస్తోందని...  ప్యాకేజిని తీసుకుని ప్రత్యేక హోదాను ముంచిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్ర‌హించారు అంబటి రాంబాబు.  ప్రత్యేక హోదాపై మేము మాట తప్పం ...మడమ తిప్పమ‌న్నారు అంబటి రాంబాబు.   హోదా కోసం రాజీనామా చేయడమేంటి అని నిప్పులు చెరిగారు అంబటి రాంబాబు.  ప్రభుత్వంలో ఉన్నవాళ్లం మేము రాజీనామా చేయాలా గతంలో చంద్రబాబు ఎంపీలు హోదా కోసం  ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలన్నారు అంబటి రాంబాబు. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అభి వృద్ధి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో నే  సాధ్య‌మ‌ని...  వైసీపీ పార్టీ ఎదురు ఎవ‌రు వ‌చ్చినా..  వారు ప‌ని అయి పోయిన‌ట్లున‌ని.. చెప్పారు. అలాగే.. నారా లోకేష్ వ్యాఖ్య‌లకు కూడా అంబటి రాంబాబు కౌంట‌ర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: