తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీక రామారావు (ఎన్టీఆర్)..ఆయన వారసుడిగా బాలయ్య అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో రాణిస్తున్న వైనం తెలిసిందే. కానీ నాన్నంతటి స్థాయిలో ప్రభుత్వ విధానాలను నిరసించడంలో వెనుకంజలోనే ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఢీకొన్న ఎన్టీఆర్ తెలుగు జాతిలో చైతన్యం నింపారు. తనకంటూ ఓ ప్రత్యేక పంథానే అలవర్చుకుని, తెలుగు జాతి రోషం, పౌరుషం దశదిశలా చాటారు. కానీ బాలయ్య నాన్నలో ఒక్క వంతు కూడా రోషం కానీ పౌరుషం కానీ చూపించలేకపోతున్నారు. ఇండస్ట్రీకి అన్యాయం జరుగుతున్నా, ఒక్కొక్కటిగా థియేటర్లు మూతపడుతున్నా బాలయ్య స్పందించడం లేదు.
జగన్ ను ఎదిరించే సాహసం బాలయ్యకు లేదా అన్నది ఓ వాదన. ఎందుకంటే బాలయ్య ముక్కోపి..ఆవేశ పరుడు.. అయినా కూడా జగన్ ను ఎదుర్కోలేకపోతున్నారు. కనీసం ఒక్క మాట కూడా అనడం లేదు ఆయనను ఉద్దేశించి..బహుశా! జగన్ తన అభిమాని అని ప్రేమ ఏమో! ఏదేమయినప్పటికీ టికెట్ రేటు తగ్గించే విషయమై బాలయ్య స్పందించక పోవడం తో ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. అంతా ఆ భగవంతుడే చూస్తాడని మొన్నటి వేళ విజయవాడలో వేదాంత ధోరణిలో బాలయ్య మాట్లాడడం కూడా ఆయన స్థాయికి తగదు. వాస్తవానికి బాలయ్య హిందూపురం ఎమ్మెల్యే.. ఆ ప్రాంత అభివృద్ధి ఏమీ లేదని అప్పుడెప్పుడో ఫైర్ అయ్యారు కూడా! హిందూపురం ఆస్పత్రుల్లో వైద్యులు బాగా పనిచేస్తున్నా సంబంధిత పరికరాల కొరత ఉందని,దీనిని వెంటనే నివారించాలని కూడా అన్నారు. హిందూపురం ఆస్పత్రి పై చూపించిన శ్రద్ధ సినిమా ఇండస్ట్రీపై ఎందుకనో చూపించడం లేదు ఆయన.