తెలంగాణ‌లో టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ నేతల మ‌ధ్య మాట‌ల యుద్ధం నిత్యం కొన‌సాగుతూనే ఉంది. ఇరు పార్టీల నేత‌లు ఎవ‌రో ఒక‌రు త‌రుచూ ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి త‌రుణంలో కేటీఆర్ కుటుంబంపై బీజేపీ నేత తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌ల‌కు టీఆర్ఎస్ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. తాజాగా బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

ముఖ్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మ‌రొక‌మారు మాట్లాడితే ముక్కలు ముక్క‌లుగా న‌రికేస్తాం అని పేర్కొన్నారు. మ‌ర‌ల ఇలాంటి వ్యాఖ్య‌లు రీపీట్ అవుతే మూడు వంద‌ల ముక్క‌లు నరుకుతామ‌ని, ఎక్కువ‌గా మాట్లాడితే నేను ఇంటికి వ‌చ్చి కొడ‌తాన‌ని వ్యాఖ్య‌లు చేశారు. దీంతో బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కాక‌రేపుతున్నాయి.

ఇదివ‌ర‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావు, కిష‌న్‌రెడ్డి, కేటీఆర్‌, ఈట‌ల రాజేంద‌ర్ ఇలా త‌రుచ‌రూ ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక వివాద‌స్ప‌దంగా టీఆర్ఎస్, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. కానీ తాజాగా బోధ‌న్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌ల‌ను పెను సంచ‌ల‌నంగా మారాయి. ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసే అవ‌కాశం క‌నిపిస్తుంది.

క్ర‌మ శిక్ష‌ణ క‌లిగిన బీజేపీ నేత తీన్మార్ మ‌ల్ల‌న్న కు నేర్పేది ఇదేనా..? అని పేర్కొన్నారు ష‌కీల్‌. మ‌ల్ల‌న్న త‌న క్యూన్యూస్ యూట్య‌బూబ్ ఛాన‌ల్ పేరు మీద కేటీఆర్ త‌న‌యుడు హిమాన్ష్‌పై వివాదస్ప‌ద వ్యాఖ్య‌లు చేసార‌ని గుర్తు చేసారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. మంత్రి కేటీఆర్‌, ఆయ‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌విత‌, ఎమ్మెల్యే బాల్క‌సుమ‌న్‌, టీఆర్ఎస్ నేత‌లు జీవ‌న్‌రెడ్డి త‌దిత‌రులు తీవ్రంగా ఆక్షేపించారు. ఇలాంటి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు దుర్మార్గం అని పేర్కొన్నారు. చింత‌పండు న‌వీన్‌కు చెంప‌దెబ్బ‌లు, చెప్పుదెబ్బ‌లు త‌ప్ప‌వు అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: