దీనిపై హైకోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ జగన్కు బెయిల్ మంజూరు చేసే విషయంలో... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును ఇది వరకే వనిపించినట్లు తెలిపారు. తీర్పు వచ్చిన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని కూడా న్యాయవాది స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు... తన తీర్పును రిజర్వ్ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు రఘురామ కృష్ణంరాజు. ముందు సీబీఐ కోర్టును ఆశ్రయించారు రఘురామ. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ తన పిటీషన్లో ఫిర్యాదు చేశారు రఘురామ. అలాగే కేసు విచారణను కావాలనే అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. ఇక కేసుకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారని సీబీఐ న్యాయస్థానంలో వాదించారు రఘురామ కృష్ణంరాజు.
దీనిపై హైకోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ జగన్కు బెయిల్ మంజూరు చేసే విషయంలో... సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తన తీర్పును ఇది వరకే వనిపించినట్లు తెలిపారు. తీర్పు వచ్చిన తర్వాత పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని కూడా న్యాయవాది స్పష్టం చేశారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై ఇరు వైపుల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు... తన తీర్పును రిజర్వ్ చేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయ సాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు రఘురామ కృష్ణంరాజు. ముందు సీబీఐ కోర్టును ఆశ్రయించారు రఘురామ. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ తన పిటీషన్లో ఫిర్యాదు చేశారు రఘురామ. అలాగే కేసు విచారణను కావాలనే అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. ఇక కేసుకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారని సీబీఐ న్యాయస్థానంలో వాదించారు రఘురామ కృష్ణంరాజు.