ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీ ఎస్ పథకం తో పాటు వాలంటరీ వ్యవస్థ ... ఈ రెండూ కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడి పోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి అని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎవరు అయితే ఓటీ ఎస్ పథకంతో పాటు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వాళ్లకు దాదాపుగా ఒక కోటి ఓట్లు బోనస్ గా వస్తాయని ఆయన చెప్పడం ఆశ్చర్యం గా మారింది.
ఈ రెండు వ్యవస్థల ద్వారా ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు వ్యవస్థలు పార్టీతో పాటు జగన్ ప్రభుత్వానికి కూడా బాగా చెడ్డపేరు తెస్తున్నాయని ... అసలు ఈ రెండింటినీ అమలు చేయమని జగన్కు ఎవరు చెప్పారో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పారు.
ఇక రఘురామ చెప్పినటువంటి వలంటీర్ల పై సొంత పార్టీ మంత్రులు - ఎమ్మెల్యేలు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. కొందరు గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచులు - ప్రజాప్రతినిధులను కూడా లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని కూడా వైసిపి నేతలు వాపోతున్నారు.