ప్రత్యేక హోదాకు సంబంధించి ఎంపీ రామూ ఈ సారి కూడా గత ఏడాది మాదిరిగానే పలు మార్లు లోక్ సభలో ప్రస్తావించారు. కేంద్రాన్ని నిలదీశారు. వైసీపీ ఎంపీలు ఆ రోజు మాట్లాడిన విధానం కన్నా ఎంపీ రామూ మాట్లాడిన పద్ధతికే మోడీ వర్గం కూడా మంచి మద్దతు అందించింది కూడా!
అదేవిధంగా లాక్డౌన్ వేళల్లో చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకు అండగా నిలిచారు యువ ఎంపీ రామూ. ముఖ్యంగా కరోనా
ఉద్ధృతి నేపథ్యంలో రక్త నిల్వలు అడుగంటిన వేళ తన వంతుగా భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున సంబంధిత శిబిరాలు ఏర్పాటు చేసి రెండు వందలకు పైగా యూనిట్లను రెడ్ క్రాస్ ద్వారా జిల్లా కేంద్రాస్పత్రికి అందించారు. ఇదొక్కటే కాదు విదేశాలలో ఉన్న తన స్నేహితుల సాయంతో రిమ్స్ లో పిల్లలకు సంబంధించి వంద ఆక్సిజన్ బెడ్లతో కూడిన ఐసీయూ ను ఏర్పాటు చేసి కలెక్టర్ కు అందించారు. ఇంకా చెప్పాలంటే లాక్డౌన్ వేళలో ఫిల్మ్ నగర్ (హైద్రాబాద్) లో తిండికి లేక అవస్థ పడుతున్న శ్రీకాకుళం వాసులకు తన స్నేహితుల ద్వారా నెలకు సరిపడా సరకులు అందించారు. వీటితో పాటు మొదటి లాక్డౌన్ వేళ తన నెల జీతం పీఎం కేర్ కు పంపించిన తొలి ఎంపీ కూడా అతనే!