చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలను రద్దు చేసిన వైఎస్ జగన్... రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కూడా ఇదే దూకుడు ప్రదర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రెండేళ్ల క్రితం జగన్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే 2019 శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి... ఆమోదింప చేసుకున్నారు. వాటికి గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే... ఈ బిల్లుకు మండలిలో ఎదురుదెబ్బ తగలడంతో.. మండలినే రద్దు చేయాలని ప్రతిపాదించారు. అయితే న్యాయ ప్రక్రియలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు చిక్కులు ఎదురయ్యాయి. మండలి రద్దు బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక రెండేళ్లుగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు.. మహాపాదయాత్ర పేరుతో అమరావతి టూ తిరుమల పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో హైకోర్టులో చిక్కులు ఎదురవ్వడంతో... ఆ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు రద్దు చేసింది. కానీ... త్వరలోనే మరో బిల్లు తెస్తామని చెప్పుకొచ్చారు జగన్. మడమ తిప్పేది లేదంటూ ఉన్న జగన్ మాటకు ఇక్కడ బ్రేక్ పడినట్లుగా అయ్యింది.
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలను రద్దు చేసిన వైఎస్ జగన్... రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కూడా ఇదే దూకుడు ప్రదర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రెండేళ్ల క్రితం జగన్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే 2019 శాసనసభ శీతాకాల సమావేశాల్లో రెండు బిల్లులు ప్రవేశపెట్టి... ఆమోదింప చేసుకున్నారు. వాటికి గవర్నర్ ఆమోదం కూడా తీసుకుంది. అయితే... ఈ బిల్లుకు మండలిలో ఎదురుదెబ్బ తగలడంతో.. మండలినే రద్దు చేయాలని ప్రతిపాదించారు. అయితే న్యాయ ప్రక్రియలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు చిక్కులు ఎదురయ్యాయి. మండలి రద్దు బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. ఇక రెండేళ్లుగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులు.. మహాపాదయాత్ర పేరుతో అమరావతి టూ తిరుమల పాదయాత్ర చేపట్టారు. ఈ సమయంలో హైకోర్టులో చిక్కులు ఎదురవ్వడంతో... ఆ బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు రద్దు చేసింది. కానీ... త్వరలోనే మరో బిల్లు తెస్తామని చెప్పుకొచ్చారు జగన్. మడమ తిప్పేది లేదంటూ ఉన్న జగన్ మాటకు ఇక్కడ బ్రేక్ పడినట్లుగా అయ్యింది.