ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు...దూకుడు పెంచారు. ఇంతకాలం పెద్దగా ఫైర్ చూపించని సోము...ఇప్పుడు తెగ ఫైర్ అయిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. అలాగే తనపై విమర్శలు చేసేవారికి వెంటనే కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. అసలు సోము ఇదివరకు ఇంత ఫైర్ మాత్రం చూపించలేదు. ఏదో పేరుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు గానీ...పెద్దగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయలే దు. ఎంతసేపు చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు తప్ప...జగన్‌ని ఒక మాట కూడా అనేవారు కాదు.

అలాంటి సోము ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై దూకుడుగా వెళుతున్నారు. మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన దగ్గర నుంచి ఏపీ బీజేపీ నేతల వైఖరిలో మార్పు వచ్చింది. అలాగే సోము కూడా మారిపోయారు..జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. ఇక తాజాగా బీజేపీని గెలిపిస్తే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోము పై విమర్శలు వస్తున్నాయి.

అయినా సరే సోము వెనక్కి తగ్గడం లేదు...పేదల కోసం మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చామని చెబుతున్నారు. బాటిల్‌తో కలిపి లిక్కర్‌ ఖరీదు రూ.6. దాన్ని జగన్ ప్రభుత్వం రూ.250కు అమ్ముతుంటే తాను  ప్రోత్సహించనని, అందుకే రూ.50కే ఇస్తానని చెప్పానని అంటున్నారు. అలాగే తనని సారాయి వీర్రాజు అనే వారికి కౌంటర్లు ఇచ్చారు....తాను సారాయి వీర్రాజునే కాదు...కోడిగుడ్ల వీర్రాజుని, సిమెంట్ వీర్రాజుని అంటూ ఫైర్ అయిపోయారు.

అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా సోము కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము 3 గంటల వరకు ఏం చేస్తారో అందరికీ తెలుసని అన్నారు. అయితే ఇలా సోము దూకుడు పెంచడానికి చాలా కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తన అధ్యక్ష పదవికి ఎసరు వస్తుందని చెప్పి..సోము ఇలా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: