పంజాబ్ ఎన్నికల సందర్భంగా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. త్వరలో పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పార్టీ అంతర్గత అంచనా ప్రకారం పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీకి చేరువలో ఉంటుంది. పంజాబ్ శాసనసభ ఎన్నికల కోసం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ పిఎసి సమావేశంలో ఆప్ ఎంపి భగవంత్ మాన్ ఆమోదం పొందారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భగవంత్ మాన్ ప్రస్తుతం పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. పంజాబ్లో ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది. పంజాబ్లో పార్టీ ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా అనేక ర్యాలీలు నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత ఏడాది కాలంలో ఢిల్లీ తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో ఎన్నికల వాగ్దానాలు చేయడం గమనార్హం. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రంలోని 99 లక్షల మంది మహిళల ఖాతాలో ప్రతి నెల రూ.1,000 జమ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వితంతు, వృద్ధాప్య పింఛనుతో పాటు ఈ సాయం అందజేస్తారు.