24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 జనవరి 7 మరియు 8 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) జరగనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (DARPG), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) మరియు తెలంగాణ ప్రభుత్వం తో కలిసి ఈ సదస్సును నిర్వహిస్తుంది.  ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ‘ఇండియాస్ టెకేడ్: డిజిటల్ గవర్నెన్స్ ఇన్ ఎ పోస్ట్ పాండమిక్ వరల్డ్‌.’జరుగుతోంది.  ప్రారంభ సెషన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.  ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత వహించనున్నారు. 

ఈ సదస్సులో ఆత్మ నిర్భర్ భారత్, పబ్లిక్ సర్వీసెస్ యూనివర్సలైజేషన్, ఇన్నోవేషన్ - ప్లాట్‌ఫార్మైజేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇండియాస్ టెకేడ్ - డిజిటల్ ఎకానమీ (డిజిటల్ పేమెంట్స్ - బిల్డింగ్ సిటిజన్స్ కాన్ఫిడెన్స్) వంటి పలు అంశాలపై స్పీకర్ సెషన్‌లు కూడా ఉంటాయి.కాన్ఫరెన్స్ మొదటి రోజున (జనవరి 7న) నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డ్స్- 2021 ప్రధానం చేయబడుతాయి.

ఇ-గవర్నెన్స్‌పై నిర్వహిస్తున్న ఈ సదస్సు ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల ప్రభావవంతమైన అమలును గుర్తించడానికి, ప్రోత్సహించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలలోని ఉన్నతాధికారులు, ఇ-గవర్నెన్స్‌ నిపుణులు  ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోవడం తో పాటు ఇ-గవర్నెన్స్  లో ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం  గురించి చర్చిస్తారు.ఈ వేదిక ద్వారా  ఇస్తున్న  అవార్డులు  ఇ-గవర్నెన్స్ మరియు డిజిటలైజేషన్‌ రంగాల్లో కృషి చేస్తున్న  వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తున్నాయి.  రెండు రోజులు జరిగే ఈ సదస్సులో,  నిర్ధారించిన   థీమ్‌లు మరియు సబ్-థీమ్స్ లపై  పలు సెషన్స్ తో పాటు, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారుల తో పాటు  ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సు లో పాల్గొంటారు

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr