తొలివేవ్లో కోవిడ్ను సమర్థంగా నిలువరించిన కేరళలో రెండోవేవ్ అతలాకుతలం చేయగా ఇప్పుడు మరోసారి అక్కడి ప్రజలను వణికిస్తోంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 4,650 కొత్త కేసులు రాగా 220మందికి పైగా చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులోనే 15వేలకు పైగా కేసులు రాగా ఆరుగురు చనిపోయారు. కోవిడ్ ఉధృతంగా ఉన్న గత ఏడాది మే 8 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోనూ రోజువారీ కేసులు 25వేలకు చేరుకోగా వీటిలో 15వేలకు పైగా ముంబయి నగరంలోనే ఉంటున్నాయి. వెస్ట్ బెంగాల్ పరిస్థితి సైతం దీనికి భిన్నంగాలేదు. పరిస్థితులను అంచనా వేసిన తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలవరం మొదలైంది. కేసుల్లో పెరుగుదల వేగంగా ఉంది. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు తరలివెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్న పలువురు కోవిడ్ ముప్పు భయంతో సందిగ్దంలో పడ్డారు. ఏపీలో కొత్తగా 547 కేసులు నమోదు కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,266 కు చేరుకుంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరాదిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటంతో, కోవిడ్ ప్రభావం ఇక్కడ ఏమేరకు ఉండనుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిని నియంత్రించేందుకు గాను ఇప్పటికే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈసీతో సమావేశమై పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది.
తొలివేవ్లో కోవిడ్ను సమర్థంగా నిలువరించిన కేరళలో రెండోవేవ్ అతలాకుతలం చేయగా ఇప్పుడు మరోసారి అక్కడి ప్రజలను వణికిస్తోంది. అక్కడ గడిచిన 24 గంటల్లో 4,650 కొత్త కేసులు రాగా 220మందికి పైగా చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులోనే 15వేలకు పైగా కేసులు రాగా ఆరుగురు చనిపోయారు. కోవిడ్ ఉధృతంగా ఉన్న గత ఏడాది మే 8 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోనూ రోజువారీ కేసులు 25వేలకు చేరుకోగా వీటిలో 15వేలకు పైగా ముంబయి నగరంలోనే ఉంటున్నాయి. వెస్ట్ బెంగాల్ పరిస్థితి సైతం దీనికి భిన్నంగాలేదు. పరిస్థితులను అంచనా వేసిన తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కలవరం మొదలైంది. కేసుల్లో పెరుగుదల వేగంగా ఉంది. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు తరలివెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్న పలువురు కోవిడ్ ముప్పు భయంతో సందిగ్దంలో పడ్డారు. ఏపీలో కొత్తగా 547 కేసులు నమోదు కావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,266 కు చేరుకుంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరాదిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే అక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తుండటంతో, కోవిడ్ ప్రభావం ఇక్కడ ఏమేరకు ఉండనుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిని నియంత్రించేందుకు గాను ఇప్పటికే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈసీతో సమావేశమై పరిస్థితిని వివరించినట్టు తెలుస్తోంది.