2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిమిడి కళా వెంకట్రావు... దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. పార్టీలో సీనియర్ నేత కావడంతో... కళా వెంకట్రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదే సమయంలో... రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు కిమిడి కళా వెంకట్రావు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కళా వెంకట్రావు ఓడారు. నాటి నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం నేతల్లో నిత్యం సమీక్షలు చేస్తున్నారు కళా వెంకట్రావు. అయితే... ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కూడా. ఇదే సమయంలో ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు మరో నేత కూడా రెడీ అయ్యారు. కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇప్పటికే.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రణస్థలం, లావేరు మండలాల్లో ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో కళా వెంకట్రావు భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి వేచి చూడాల్సి ఉంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిమిడి కళా వెంకట్రావు... దాదాపు 7 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. పార్టీలో సీనియర్ నేత కావడంతో... కళా వెంకట్రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అదే సమయంలో... రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు కిమిడి కళా వెంకట్రావు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కళా వెంకట్రావు ఓడారు. నాటి నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం నేతల్లో నిత్యం సమీక్షలు చేస్తున్నారు కళా వెంకట్రావు. అయితే... ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కూడా. ఇదే సమయంలో ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు మరో నేత కూడా రెడీ అయ్యారు. కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఇప్పటికే.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రణస్థలం, లావేరు మండలాల్లో ఇప్పటికే పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో కళా వెంకట్రావు భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి వేచి చూడాల్సి ఉంది.