అయితే ఎన్నికల తర్వాత టీడీపీ ఒంటరిగా మిగిలిపోగా... బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. 2024 వరకు తమ పొత్తు కొనసాగుతుందని కూడా బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అన్నట్లుగానే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య వాతావరణం కాస్త బెడిసికొట్టినట్లుగా ఉంది. ఇదే సమయంలో బీజేపీ, జనసేన పార్టీలకు దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు పార్టీలు విడివిడిగా.. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలుస్తాయని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విషయం మా వల్ల కాదని బహిరంగంగా చెబితే... తానే స్వయంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీని ఓడిస్తామన్నారు. ఇప్పుడు రఘురామ బీజేపీ తరఫున పోటీ చేస్తే... టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారా... లేదా అనే విషయం తేలాల్సి ఉంది.
అయితే ఎన్నికల తర్వాత టీడీపీ ఒంటరిగా మిగిలిపోగా... బీజేపీ మాత్రం జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. 2024 వరకు తమ పొత్తు కొనసాగుతుందని కూడా బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అన్నట్లుగానే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు. కానీ ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య వాతావరణం కాస్త బెడిసికొట్టినట్లుగా ఉంది. ఇదే సమయంలో బీజేపీ, జనసేన పార్టీలకు దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు పార్టీలు విడివిడిగా.. అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలుస్తాయని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ విషయం మా వల్ల కాదని బహిరంగంగా చెబితే... తానే స్వయంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీని ఓడిస్తామన్నారు. ఇప్పుడు రఘురామ బీజేపీ తరఫున పోటీ చేస్తే... టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటారా... లేదా అనే విషయం తేలాల్సి ఉంది.