బసవతారకం ఆసుపత్రిలో ఈ రోజు 21 బెడ్స్ తో ఒక అధునాతన DAY CARE వార్డ్ ప్రారంభించారు బాలయ్య.  ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. 100 పడకల ఆసుపత్రిగా మొదలైన ఈ ప్రస్థానం ఈ రోజు 650 పడకలుగా అభివృద్ధి చెందడం...  అనేక అధునాతన సౌకర్యాలను సమకూర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.  రోజు రోజుకి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడం చాలా బాధాకరమైన విషయం, నాణ్యమైన క్యాన్సర్ చికిత్స ను వారికి అందుబాటులోకి తీసుకురావడం... అవసరమైన అత్యాధునిక సదుపాయాలు కల్పించడం... అతి తక్కువ ఖర్చుతో లాభాపేక్ష లేకుండా సేవ చేయడం తమ ఆసుపత్రి యొక్క లక్ష్యమన్నారు. ఈ పెరుగుతున్న క్యాన్సర్  రోగుల దృష్ట్యా ఆసుపత్రి ని మనం విస్తరిస్తున్నామని..  సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క రోగికి వారి ఆర్ధిక స్థోమతతో సంబంధం లేకుండా చికిత్సను అందించడం ఆసుపత్రి యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి అన్నారు.

మేము చేస్తున్న ఈ నాణ్యమైన సేవలను గుర్తిస్తూ ది వీక్ హన్సా మ్యాగజిన్  సర్వే చేసి భారతదేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిలలో ఒకటిగా టాప్ 6 వ ర్యాంక్  ఇవ్వడం జరిగిందని... గత 5 సంవత్సరాలుగా మన యొక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నామని వెల్లడించారు. మన  రెండు తెలుగు రాష్ట్రాల నుండి ర్యాంక్  సాధించిన ఏకైక ఆసుపత్రి మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్  హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం ఎంతో గర్వంగా  ఉందన్నారు. ఇటీవల niti aayog మన ఆసుపత్రిని స్టడీ చేసి భారతదేశం లోనే అత్యుత్తమ లాభాపేక్షలేని ట్రస్ట్ హాస్పటల్ గా గుర్తించడం జరిగిందని..  భారతదేశంలో ఉన్న ఆసుపత్రిల యొక్క మోడల్స్ ని స్టడీ చేయడంకోసం ఒక panel ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ panel లో మెంబెర్ గా మన CEO డాక్టర్ R v ప్రభాకర రావు గారిని ప్రతిపాదించడం జరిగిందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉందని... ఈ విదంగా ఎన్నో అవార్డులు మరియు ఎన్నో ఘనతలు సాధిస్తున్న మన ఆసుపత్రికి చైర్మన్ గా ఉండటం నాకు ఎంతో గర్వంగా ఉందని బాలయ్య పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: