ఇప్పుడు మరోసారి వైసీపీ ట్రాప్లో చంద్రబాబు ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తనను గెలిపిస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడో ఆరు నెలలకు ఓసారి కనిపించే వారు. అది కూడా నియోజకవర్గ స్థాయి నేతలతో మాత్రమే సమీక్షలు నిర్వహించేవారు. ఇక ప్రజలకు ఏవైనా పనులు జరగాలంటే... అది కేవలం కింది స్థాయి నేతల వల్ల మాత్రమే సాధ్యం. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా నెలలో రెండు, మూడు సార్లు కుప్పంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. దీంతో ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కూడా ఒకటే మాట. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికే పరిమితం అయ్యారా అని. ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో వైసీపీ వేస్తున్న రాజకీయ ఎత్తులు... అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితానికే ప్రస్తుతం వైసీపీ సవాల్ విసురుతోంది.
ఇప్పుడు మరోసారి వైసీపీ ట్రాప్లో చంద్రబాబు ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తనను గెలిపిస్తూ వస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడో ఆరు నెలలకు ఓసారి కనిపించే వారు. అది కూడా నియోజకవర్గ స్థాయి నేతలతో మాత్రమే సమీక్షలు నిర్వహించేవారు. ఇక ప్రజలకు ఏవైనా పనులు జరగాలంటే... అది కేవలం కింది స్థాయి నేతల వల్ల మాత్రమే సాధ్యం. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా నెలలో రెండు, మూడు సార్లు కుప్పంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు. దీంతో ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కూడా ఒకటే మాట. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికే పరిమితం అయ్యారా అని. ఎలాగైనా కుప్పం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో వైసీపీ వేస్తున్న రాజకీయ ఎత్తులు... అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితానికే ప్రస్తుతం వైసీపీ సవాల్ విసురుతోంది.