ఇప్పటికే దేశ తూర్పు తీరంలో హ్యాట్రిక్ విజయం సాధించారు మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్ర మోదీ సహా.... కమలం పార్టీ అగ్రనేతలంతా కలిసి జోరుగా ప్రచారం చేసినా.... దీదీ సర్కార్పై దుమ్మెత్తి పోసినా.... తృణమూల్ నేతలను తమలో చేర్చుకున్నా కూడా... దీదీ గెలుపు ఆపలేక పోయారు. అదే జోరులో ఉన్న ఇప్పుడు పశ్చిమ తీరంలో కూడా పవర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణిజ్యపరంగా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్న గోవా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దీదీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న మహారాష్ట్ర వాదీ గోమాంతక్ పార్టీతో టీఎంసీ పొత్తు పెట్టుకుంది. అలాగే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలపైనే టీఎంసీ కన్నేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు దీదీ. ఇప్పటికే టీఎంసీ ఎంపీ మోహువా మిత్రాను గోవా ఇంఛార్జ్ గా నియమించారు మమతా బెనర్జీ. దాదాపు రెండు నెలలుగా గోవాలోనే మిత్రా మకాం వేశారు. దీంతో గోవాలో టీఎంసీ గెలుస్తుందో లేదో చూడాలి మరి.
ఇప్పటికే దేశ తూర్పు తీరంలో హ్యాట్రిక్ విజయం సాధించారు మమతా బెనర్జీ. ప్రధాని నరేంద్ర మోదీ సహా.... కమలం పార్టీ అగ్రనేతలంతా కలిసి జోరుగా ప్రచారం చేసినా.... దీదీ సర్కార్పై దుమ్మెత్తి పోసినా.... తృణమూల్ నేతలను తమలో చేర్చుకున్నా కూడా... దీదీ గెలుపు ఆపలేక పోయారు. అదే జోరులో ఉన్న ఇప్పుడు పశ్చిమ తీరంలో కూడా పవర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాణిజ్యపరంగా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్న గోవా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు దీదీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న మహారాష్ట్ర వాదీ గోమాంతక్ పార్టీతో టీఎంసీ పొత్తు పెట్టుకుంది. అలాగే ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలపైనే టీఎంసీ కన్నేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో చేర్చుకుంటున్నారు దీదీ. ఇప్పటికే టీఎంసీ ఎంపీ మోహువా మిత్రాను గోవా ఇంఛార్జ్ గా నియమించారు మమతా బెనర్జీ. దాదాపు రెండు నెలలుగా గోవాలోనే మిత్రా మకాం వేశారు. దీంతో గోవాలో టీఎంసీ గెలుస్తుందో లేదో చూడాలి మరి.