సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, కోడి పందాలతో గోదావరి జిల్లాలు ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఈ పండుగ కోసం సొంత జిల్లా నేతలతో పాటు ఇతర ప్రాంతాల వాళ్లు కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు. ఇక కోడి పందాల సమయంలో అయితే... తమ తమ స్వగ్రామాల్లోనే నేతలంతా ఉంటారు. తమ అభిమానులు, కార్యకర్తలతో ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. కానీ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం... దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ.... తనను సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపైన, నేతలపైన కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రఘురామ దర్శనం లేకుండానే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెండు సంక్రాంతులు పూర్తి చేసుకున్నారు. ఇక ముచ్చటగా మూడో సంక్రాంతికి అయినా... తమ ఎంపీగారు వస్తారో లేదో అని ఇప్పటికే బెట్టింగ్లు వేసుకుంటున్నారు కూడా.
సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలు. కొత్త అల్లుళ్లు, పిండి వంటలు, కోడి పందాలతో గోదావరి జిల్లాలు ఓ ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఈ పండుగ కోసం సొంత జిల్లా నేతలతో పాటు ఇతర ప్రాంతాల వాళ్లు కూడా పెద్ద ఎత్తున గోదావరి జిల్లాలకు తరలి వస్తారు. ఇక కోడి పందాల సమయంలో అయితే... తమ తమ స్వగ్రామాల్లోనే నేతలంతా ఉంటారు. తమ అభిమానులు, కార్యకర్తలతో ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. కానీ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం... దాదాపు రెండేళ్లుగా నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితం అయిన రఘురామ.... తనను సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపైన, నేతలపైన కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రఘురామ దర్శనం లేకుండానే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెండు సంక్రాంతులు పూర్తి చేసుకున్నారు. ఇక ముచ్చటగా మూడో సంక్రాంతికి అయినా... తమ ఎంపీగారు వస్తారో లేదో అని ఇప్పటికే బెట్టింగ్లు వేసుకుంటున్నారు కూడా.