దీంతో మతపరమైన సున్నిత అంశాలను రెచ్చగొడితే ఎవరిపైనైనా చర్యలు తప్పవని ఏపీ డీజేపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు మాత్రం దీనిని రాజకీయపరంగా తమకు లబ్ధి చేకూర్చే అంశంగా మాత్రమే చూస్తున్నారు. ఆత్మకూరులో తమ పార్టీ నేతలపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగారు. విజయవాడలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు.. ఏపీ పోలీస్ వ్యవస్థపైనా తీవ్ర విమర్శలకు దిగారు. అధికార పార్టీకి తొత్తుగా ఏపీ పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తోందని, ఏపీలో దేవాలయాలపై దాడులు సహా జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని హెచ్చరించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో వచ్చే రోజుల్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు సంభవించే అంశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దీంతో మతపరమైన సున్నిత అంశాలను రెచ్చగొడితే ఎవరిపైనైనా చర్యలు తప్పవని ఏపీ డీజేపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించాల్సి వచ్చింది. అయితే బీజేపీ నేతలు మాత్రం దీనిని రాజకీయపరంగా తమకు లబ్ధి చేకూర్చే అంశంగా మాత్రమే చూస్తున్నారు. ఆత్మకూరులో తమ పార్టీ నేతలపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలకు దిగారు. విజయవాడలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు.. ఏపీ పోలీస్ వ్యవస్థపైనా తీవ్ర విమర్శలకు దిగారు. అధికార పార్టీకి తొత్తుగా ఏపీ పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తోందని, ఏపీలో దేవాలయాలపై దాడులు సహా జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని హెచ్చరించారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో వచ్చే రోజుల్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు సంభవించే అంశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.