సమర్థంగా ఎమర్జింగ్ టెక్నాలజీల వాడకం
ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఎమర్జింగ్ టెక్నాలజీస్ను సమర్థంగా వాడుకునేందుకు తెలంగాణ ఐటీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ చేపట్టిన కార్యక్రమాలను సదస్సులో ప్రత్యేకంగా వివరించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ), డ్రోన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మిషన్ లెర్నింగ్, బిగ్ డాటా, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్లను ఐటీ రంగంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్గా గుర్తించినట్టు పేర్కొన్నారు. వీటి ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కార్యకాలాపాలు, సరికొత్త ఆవిష్కరణలు చోటుచేసుకొంటున్నాయని గుర్తుచేశారు. ఒక్కో టెక్నాలజీకి ఒక ప్రేమ్ వర్క్ రూపొందించి అమలుచేస్తున్నట్టు తెలంగాణ ఐటీశాఖ అధికారులు సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. క్లౌడ్ అడాప్షన్ పాలసీ కింద క్లౌడ్ అడాప్షన్ జీవోను, ఫ్రేమ్ వర్క్-2020, ఏఐ ప్రేమ్ వర్క్-2020, డ్రోన్ ప్రేమ్ వర్క్-2019, బ్లాక్ చైయిన్ ప్రేమ్వర్క్-2019ను అమల్లోకి తీసుకొచ్చినట్టు ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ సదస్సులో ప్రధానంగా వివరించారు. ఈ ఘనత కు కారణం కేవలం ఐటీశాఖ పనితనం అని.. నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కల్వకుంట్ల తారక రామారావు.... వ్యూహాత్మకమైన అడుగుల ఈ కారణంగానే ఇంతటి విజయాన్ని సాధించినట్లు చెబుతున్నారు.