ఏపీఎస్ఆర్టీసీ ఆదివారం నుంచి ప్రారంభించిన పండుగ స్పెషల్ బస్సు సర్వీసుల్లో 50 శాతం ఛార్జీలు ఆదనంగా వసూలు చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదని తెలంగాణ ఉన్నతాధికారులు ప్రకటించగా.... 50 శాతం అదనపు ఛార్జీలు తప్పటం లేదంటూ ఎపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులే తెలిపారు. స్పెషల్ బస్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపుతున్నారు.
తెలంగాణ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు గరుడ ప్లస్ బస్సుల్లో రూ.651, సెమీ స్లీపర్ 'రాజధాని' బస్సులో రూ.546, నాన్ ఏసీ శ్రేణి సూపర్ లగ్జరీ బస్సులో రూ.426 వసూలు చేస్తున్నారు. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ ఏసీ శ్రేణి బస్సుల విషయానికి వస్తే.. అమరావతి, డాల్ఫిన్ బస్సుల్లో సాధారణ చార్జీ రూ.564 ఉండగా... స్పెషల్ చార్జీ 50 శాతం కలిపి మొత్తం రూ.846 వసూలు చేస్తున్నారు. అలాగే గరుడ బస్సుల్లో రూ.759, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.550, వెన్నెల స్లీపర్ బస్సుల్లో రూ. 1066 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి వస్తోంది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్కు నడిచే నైట్ రైడర్ బస్సులో రూ.762 మేర చార్జి వసూలు చేస్తున్నారు. మొత్తంమీద ఏపీ బస్సుల్లో అదపున చార్జీల కారణంగా ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు.