అమరావతి : కరోనా వైరస్ కు మొట్టమొదటి సారిగా ఆయుర్వేద మందును కృష్ణ పట్నం ఆనందయ్య తయారు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆయన ఇటీవలే తయారు చేసిన ఒమిక్రాన్‌ మందు పై ఆయుష్‌ శాఖ  ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఒమిక్రాన్‌ పేరుతో మందు పంపిణీ చేస్తోన్న ఆనందయ్యపై ఆయుష్‌ శాఖ సీరియస్‌ అయింది.  ఇందులో బాగంగానే ఒమిక్రాన్‌ మందు అంటూ పంపిణీ చేస్తోన్న ఆనందయ్యకు నోటీసులు జారీ చేసింది  ఆయుష్‌. ఒమిక్రాన్‌ పేరుతో పంపిణీ చేస్తోన్న మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది ఆయుష్‌. ఈ సందర్భంగా  ఆయుష్‌ కమిషనర్‌ రాములు మాట్లాడుతూ... ఒమి క్రాన్‌ కు మందు అంటూ ఆనందయ్య పంపిణీ చేస్తోన్న మందుకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు.  అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు జారీ చేశామన్నారు ఆయుష్‌ కమిషనర్‌ రాములు.  

ఒమిక్రాన్‌ మందులో ఏమేం పదార్థాలు వాడుతున్నారో చెప్పాల్సిందిగా నోటీసుల్లో స్పష్టం చేశామని.. నోటీసులకు ఆనందయ్య ఇచ్చిన సమాధానం బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఆయుష్‌ కమిషనర్‌ రాములు.  అవసరమైతే ఒమిక్రాన్‌ మందులో వాడే పదార్దాలు పరిశీలిస్తామని చెప్పారు ఆయుష్‌ కమిషనర్‌ రాములు. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను తగ్గిస్తానంటూ ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారని.. గతంలో ఆనందయ్య తయారు చేసిన మందుకు ఇప్పటి వరకు లైసెన్స్ తీసుకోలేదన్నారు.  లైసెన్స్‌ కోసం యూజర్ ఐడీ, పాస్‌ వర్డ్‌ తీసుకున్నారు కానీ.. ఇప్పటి వరకు అప్లికేషన్‌ పెట్టలేదని.. ఆనందయ్య అప్లికేషన్‌ పెడితేనే లైసెన్స్‌ లభిస్తుందని వెల్లడించారు ఆయుష్‌ కమిషనర్‌ రాములు. కరోనా పేరుతో.. ఒమిక్రాన్‌ పేరుతో అనుమతి లేని మందులను వాడొద్దన్నారు.  ఆయుష్‌ శాఖ ఇమ్యూనిటీ బూస్టర్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తోందని.. వేల రూపాయలు పోసి ఎవ్వరూ అనుమతి లేని మందులను కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశారు ఆయుష్‌ కమిషనర్‌ రాములు.

మరింత సమాచారం తెలుసుకోండి: