బీజేపీ పాలితరాష్ట్రల్లో రైతుబంధు ఉందా ?  తెలంగాణలో వ్యవసాయభూములకు భారీగా ధరలు.. ఆంధ్రాలో డమాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మొరుగుతున్నారని ఫైర్ అయ్యారు... దమ్ముంటే కేసీఆర్ ను టచ్ చేసి చూడండి... మా దమ్ము ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.  రేవంత్ బుడ్డారఖాన్... సంజయ్ మెంటల్... అర్వింద్ ఏమి లేనోడు అంటూ చురకలు అంటించారు. మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది. అస్సాం నుంచి వచ్చి ఇంకొడు మొరుగుతున్నడని.. వాళ్ళ రాష్ట్రంలో ఒక ఎకరం భూమి ధర రూ.2 లక్షలు లేదు. ఇక్కడ ధర ఎందుకు పెరిగింది అంటే... పుష్కలంగా నీళ్లు, పుష్కలమైన ఉచిత కరెంట్, రైతుబంధు వల్ల భూముల ధరలు పెరిగినాయని చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 

ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారు. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా ? అని ప్రశ్నించారు.  తెలంగాణ వాళ్ళు బీహార్, మదే ప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ కు వెళ్తున్నారా ?  బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిలు ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఇట్లా ఉందని మండిపడ్డారు. . రైతుబంధు, సాగునీరు మీ పాలిత రాష్ట్రంలో ఇస్తున్నారా ? నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని...  అర్వింద్, సంజయ్ రాజీనామా చేస్తారా ? సవాల్ స్వీకరించాలని సవాల్ విసిరారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గెలిచిన 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని మాటతప్పిన సిగ్గులేనివాడు అర్వింద్... అని.. సిగ్గులేకుండా ఇంకా గ్రామాల్లో  తిరుగుతున్నాడని ఫైర్ అయ్యారు.  దేశ వ్యవసాయ మంత్రి పసుపుబోర్డు ఇవ్వాలని చెప్పిన వెంటనే బాయిల బండ కట్టుకొని చచ్చిపోవాలి... నేనైతే అదే పని చేస్తుంటి. ఆంబోతు లెక్క ఊర్ల మీద పడి అర్వింద్ తిరుగుతున్నడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను జైళ్లో పెడతా అంటున్న వెదవలారా దమ్ముంటే విచారణ చేయుండన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: