దాడిపై ప్రశ్నిస్తే తనపై సొంత మీడియాలో దుష్ప్రచారం సాగించారని, ప్రశ్నించే హక్కును సైతం హరించాలనుకోవడం అదీ ఓ ఎంపీని కూడా విడవకపోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యమో అర్థం చేసుకోవాలన్నారు. చేతనైతే తనపై అనర్హత వేటు వేయాలని వచ్చే నెల 5వరకు సమయమిస్తున్నానని మరోసారి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని, పార్టీలకు అతీతంగా అందరి మద్దతు ఉంటుందన్న నమ్మకం ఉందని రఘురామరాజు అన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై పోరాటంలో ఎంపీ రఘురామరాజు ఎక్కడా వెనక్కుతగ్గబోవడం లేదని స్పష్టంగా తేలినట్టే. కాగా ఆయన త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని ఇప్పటిదాకా వార్తలు రాగా, జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కొట్టి పారేయలేమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వస్తున్నాయి.
దాడిపై ప్రశ్నిస్తే తనపై సొంత మీడియాలో దుష్ప్రచారం సాగించారని, ప్రశ్నించే హక్కును సైతం హరించాలనుకోవడం అదీ ఓ ఎంపీని కూడా విడవకపోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యమో అర్థం చేసుకోవాలన్నారు. చేతనైతే తనపై అనర్హత వేటు వేయాలని వచ్చే నెల 5వరకు సమయమిస్తున్నానని మరోసారి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని, పార్టీలకు అతీతంగా అందరి మద్దతు ఉంటుందన్న నమ్మకం ఉందని రఘురామరాజు అన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వంపై పోరాటంలో ఎంపీ రఘురామరాజు ఎక్కడా వెనక్కుతగ్గబోవడం లేదని స్పష్టంగా తేలినట్టే. కాగా ఆయన త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని ఇప్పటిదాకా వార్తలు రాగా, జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని సైతం కొట్టి పారేయలేమని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వస్తున్నాయి.