పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంపై బీజేపీకి గట్టి పట్టు ఉంది. దీంతో అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనేది కమలం పార్టీ ప్లాన్. అలాగే తొలి దశ పోలింగ్ సరళి... మిగిలిన అన్ని దశలపై ఉంటుందని ఆ పార్టీ నేతల భావన. దీంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు కాషాయ అగ్రనేతలు. అయితే అధికారం తమదే అని గట్టి ధీమాతో ఉన్న కమలం పార్టీ నేతలకు.... ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి. కేవలం 48 గంటల్లోనే ఆరుగురు కీలక నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రి, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది యోగీ సర్కార్. ఎప్పుడో 2014లో ఆయన విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కేసుకు సంబంధించిన అరెస్ట్ వారెంట్ ఇప్పుడు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 24వ తేదీ లోపు కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.
పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతంపై బీజేపీకి గట్టి పట్టు ఉంది. దీంతో అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనేది కమలం పార్టీ ప్లాన్. అలాగే తొలి దశ పోలింగ్ సరళి... మిగిలిన అన్ని దశలపై ఉంటుందని ఆ పార్టీ నేతల భావన. దీంతో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు కాషాయ అగ్రనేతలు. అయితే అధికారం తమదే అని గట్టి ధీమాతో ఉన్న కమలం పార్టీ నేతలకు.... ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి. కేవలం 48 గంటల్లోనే ఆరుగురు కీలక నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రి, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీరంతా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీకి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది యోగీ సర్కార్. ఎప్పుడో 2014లో ఆయన విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన కేసుకు సంబంధించిన అరెస్ట్ వారెంట్ ఇప్పుడు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 24వ తేదీ లోపు కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.