ఎయిర్ పోర్ట్ లో ఏం మాట్లాడాలో అన్నది తెలుసుకోవాలి..అందుకు అనుగుణంగా నడుచుకోవాలి.. ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే నాయకులు ఎదగలేరు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటే బూతులు తిట్టకూడుదు అన్న ఇంగితం ఒకటి తప్పక ఉండాలి. ఇవేవీ లేకుండా నాయకులు ఎలా అవుతారు?
బూతులు తిట్టడంలో మరో ఎమ్మెల్యే కొడుకు వివాదంలో ఇరుక్కున్నాడు.వైసీపీ అధికార సభ్యుల జాబితాలో ఆయన కూడా చేరిపోయి తాజాగా హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్న బూతుల మంత్రుల చెంత ఎమ్మెల్యే చెంత ఓ డిప్యూటీ మేయర్ చేరిపోయారు. ఇదీ ఆయన పై వినిపిస్తున్న ఆరోపణల తీరు. ఇందులో నిజం అబద్ధం అన్నవి తిర్పతి సామే తేల్చాలి? ఇప్పటికే చిత్తూరు ప్రజా ప్రతినిధులు చాలా వివాదాల్లో ఉన్నారు. పెద్దిరెడ్డి తో సహా అంతా విపక్షాన్ని నోటికి వచ్చిన విధంగా మాటలు అంటున్నారు. ఇంకొందరు స్వరం పెంచి బూతులు తిడుతున్నారు. స్థాయి మరిచి మరీ! తిడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఓ రాజకీయ నాయకుని పుత్ర రత్నం తీరు కొంత వివాదాలకు తావిస్తోంది.
ఓ వివాదంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, తుడా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి ఇరుక్కున్నారు. దీంతో స్థానిక రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి.ఇప్పటికే పలు మార్లు పలు వివాదాల్లో వైసీపీ నాయకులు ఉన్న సంగతి విధితమే!వాటికి తోడుగా జగన్ మరో తలనొప్పి అంటించుకునేలా చేస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే. కనీసం సమస్యను పరిష్కరించకపోగా వివాదాన్ని పెంచి పెద్దది చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల బొత్స తిరుపతి వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఇది. బొత్స రాక నేపథ్యంలో ఆయనను స్వాగతించేందుకు రేణిగుంట విమానాశ్రయానికి భారీ ఎత్తున కార్యకర్తలతో అభినయ్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే వీళ్లను వెళ్లనివ్వలేదు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది. నియమ నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. దీంతో ఆగ్రహించిన అభినయ్ రెడ్డి నోటికివచ్చిందంతా తిట్టారు. అంతటితో ఆగక తన పంతం నెగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఎయిర్ పోర్టుకు వెళ్లే వాటర్ పైప్ లైన్లు తొలగించారు అని సమాచారం. అదేవిధంగా డ్రైనేజీ మరమ్మతుల పేరుతో ఇంకొంత అరాచకం సృష్టించారు అని కూడా తెలుస్తోంది.