అధికారం ఉన్నా లేకపోయినా కూడా
జగన్ రారాజే అన్న విషయం మరిచిపోకు
అని అంటోంది వైసీపీ..
హా అవును ఎవరింటి డబ్బులు వాళ్లు ఖర్చుచేస్తే ఓ లెక్క
జనం డబ్బు ఇష్టం వచ్చిన విధంగా ఖర్చు చేస్తే అది మరో లెక్క
ఆ లెక్క వృథా లెక్క. కానీ జగన్ చేస్తున్నదే వృథా కనుక
ఆయనకు లెక్కలు అక్కర్లేదు...
సీఎం జగన్ ఏం చేసినా ప్రత్యేకమే.. ఏం చేయకపోయినా ప్రత్యేకమే.ఎందుకంటే ఆయన రూటు వేరు.ఆయన రూటు నేలపై ఉండదు.. నింగిలో ఉండును..నింగిదారుల్లో ఆయన నడుచును..ఆ విధంగా ఆయన హెలికాఫ్టర్ సేవలను ఇష్టం వచ్చిన విధంగా వాడుకుని ఇష్టం వచ్చిన విధంగా ప్రజాధనం వృథా చేయను ఏమని అడగకు.. ఎందుకు అని కూడా అడగకు..నీకు పుణ్యం ఉంటుంది అలా అడిగావా అధికార పార్టీవోళ్లు తిడ్తారు.. ఒళ్లు జాగ్రత్త అని కూడా అంటారు.
ఒక వ్యక్తి అధికారం కారణంగా ఏమయినా చేయొచ్చు.. తానున్న ప్రాంతానికి, తాను చేరుకోవాల్సిన ప్రాంతానికి మధ్య 30 కిలోమీటర్లు దూరం ఉన్నా కూడా పట్టించుకోండా ఆన్ రోడ్ వెళ్లకుండా హాయిగా హెలికాఫ్టర్ ఎక్కవచ్చు..తాడేపల్లి నుంచి గుంటూరుకు చేరుకోవాలంటే మంచి రోడ్లున్నా కూడా మన సీఎంకు అవి పట్టవు.. ఆయనకు ఆకాశ వీధుల్లో వెళ్తేనే ఆనందం.. అలాంటి ఆనందాలు గతంలోనూ ఆయన పొంది ఉన్నారు. ఇప్పుడు వాటికి కొనసాగింపు అంతే!
రాజు తలుచుకోవాలే కానీ ఏమయినా జరుగుతుంది.. అలా జరగడం వెనుక జగన్ ఒక్కరే కాదు చాలా మంది కారణం అయి ఉంటారు.జగన్ కు ఏం ఖర్మ రోడ్డు మార్గాన పోయి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించేందుకు. ఎంచక్కా హెలికాప్టర్ ఉంది వాడుకోవడమే! అది ఎంత తక్కువ దూరం అయినా పట్టింపు ఉండదు.డబ్బులు ఎవరివి మీవి నావి ఆయనివి కాదు కదా! అందుకే విలాసాలు.. ఆపాటి కులాసాగా ఉండాలంటే విలాసాలు తప్పవులేండి.. మనిషి అసలే పాడైపోడు.. తెలుపు శరీరం కాస్త నలుపై పోదు. ఏం చేసినా ఇవాళ జగన్ కు చెల్లుతుంది. మరో రెండున్నరేళ్లు చెల్లుతుంది కూడా! ఆ తరువాత మాత్రం అస్సలు చెల్లదు.