యోగీ ఆదిత్యానాఖ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే సర్వే రిపోర్టులు కూడా వెల్లడించాయి. దీంతో ఆ కమలం పార్టీ నేతలు కూడా తమదే విషయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అధికారం మాట పక్కన పెడితే... గెలుస్తామో లేదో అనే అనుమానం కూడా ప్రస్తుతం తలెత్తుతోంది. నేతలంతా పార్టీకీ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీకి రాజీనామా చేసిన నేతలంతా కూడా ఎస్పీ ఓటు బ్యాంకు అయిన బీసీలే కావడంతో... ఈ విషయం కాషాయ పార్టీకి ఎంత నష్టం చేస్తుందో... అంతకు రెట్టింపు స్థాయిలో అఖిలేష్ పార్టీకి లాభం చేస్తోందనేది రాజకీయ విమర్శకుల మాట. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు కమలం పార్టీకి రాజీనామా చేశారు. వీరి ప్రభావం రాష్ట్రంలో కనీసం 30కి పైగా నియోజకవర్గాల్లో స్పష్టంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా బీజేపీకి రాజీనామా చేసి అఖిలేష్ సారధ్యంలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాషాయా పార్టీ అగ్రనేతలు... ప్రస్తుత పరిస్థితులను సరి చేసేందుకు రంగంలోకి దిగారు.
యోగీ ఆదిత్యానాఖ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటికే సర్వే రిపోర్టులు కూడా వెల్లడించాయి. దీంతో ఆ కమలం పార్టీ నేతలు కూడా తమదే విషయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఇప్పుడు వారి అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అధికారం మాట పక్కన పెడితే... గెలుస్తామో లేదో అనే అనుమానం కూడా ప్రస్తుతం తలెత్తుతోంది. నేతలంతా పార్టీకీ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీకి రాజీనామా చేసిన నేతలంతా కూడా ఎస్పీ ఓటు బ్యాంకు అయిన బీసీలే కావడంతో... ఈ విషయం కాషాయ పార్టీకి ఎంత నష్టం చేస్తుందో... అంతకు రెట్టింపు స్థాయిలో అఖిలేష్ పార్టీకి లాభం చేస్తోందనేది రాజకీయ విమర్శకుల మాట. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు కమలం పార్టీకి రాజీనామా చేశారు. వీరి ప్రభావం రాష్ట్రంలో కనీసం 30కి పైగా నియోజకవర్గాల్లో స్పష్టంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి బాటలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా బీజేపీకి రాజీనామా చేసి అఖిలేష్ సారధ్యంలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాషాయా పార్టీ అగ్రనేతలు... ప్రస్తుత పరిస్థితులను సరి చేసేందుకు రంగంలోకి దిగారు.