ఇందులో భాగంగానే సరిహద్దుల్లో జూన్ 16, 2020న భారత్ సైనికులను కవ్వించి వారిపై దాడి చేసి 20 మందిని చైనా సైన్యం బలి తీసుకుంది. దాంతో ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. భారత్ సైనికుల ప్రతిదాడిలో పలువురు చైనా సైనికులు కూడా చనిపోయారు. కానీ చైనా ప్రభుత్వం దానిని చాలాకాలం అంగీకరించలేదు. నాటినుంచి ఇండో చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ఇరుదేశాల సైన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అక్కడకు ఆయుధాలు చేరవేయడంతోపాటు బంకర్లు కూడా నిర్మించుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు పెరగకుండా క్రమం తప్పకుండా చర్చలు జరుగుతున్నాయి. అయితే చైనా తనకు సహజ కుటిల వైఖరిని ప్రదర్శిస్తూ చర్చల ద్వారా కాలయాపన చేస్తూ సరిహద్దుల్లో బలగాలను పెంచుకుంటోంది. చైనా వైఖరి భారత్ను అనివార్యంగా ఆయుధ పోటీలోకి లాగి ఆర్థికంగా దెబ్బ తీసేందుకేనన్న అభిప్రాయాలూ రక్షణ రంగ నిపుణులనుంచి వ్యక్తమవుతున్నాయి.
ఇందులో భాగంగానే సరిహద్దుల్లో జూన్ 16, 2020న భారత్ సైనికులను కవ్వించి వారిపై దాడి చేసి 20 మందిని చైనా సైన్యం బలి తీసుకుంది. దాంతో ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. భారత్ సైనికుల ప్రతిదాడిలో పలువురు చైనా సైనికులు కూడా చనిపోయారు. కానీ చైనా ప్రభుత్వం దానిని చాలాకాలం అంగీకరించలేదు. నాటినుంచి ఇండో చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్ ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు ఇరుదేశాల సైన్యాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అక్కడకు ఆయుధాలు చేరవేయడంతోపాటు బంకర్లు కూడా నిర్మించుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు పెరగకుండా క్రమం తప్పకుండా చర్చలు జరుగుతున్నాయి. అయితే చైనా తనకు సహజ కుటిల వైఖరిని ప్రదర్శిస్తూ చర్చల ద్వారా కాలయాపన చేస్తూ సరిహద్దుల్లో బలగాలను పెంచుకుంటోంది. చైనా వైఖరి భారత్ను అనివార్యంగా ఆయుధ పోటీలోకి లాగి ఆర్థికంగా దెబ్బ తీసేందుకేనన్న అభిప్రాయాలూ రక్షణ రంగ నిపుణులనుంచి వ్యక్తమవుతున్నాయి.