తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పై తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  మరో సారి రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.  గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వం  అని మండిపడ్డారు  బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.  ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని అగ్రహించారు బండి సంజయ్ కుమార్.  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు  బండి సంజయ్ కుమార్.   

ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికేట్లు ఇచ్చేందుకు  కాలేజీ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని అగ్రహించారు  బండి సంజయ్ కుమార్.  ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజులు ఎంత ఉంటే అంత ప్రభుత్వమే చెల్లించేదన్నారు  బండి సంజయ్ కుమార్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచిందని నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్.
 
10 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆ పై ర్యాంకు వచ్చిన వారికి రూ. 35 వేలు మాత్రమే చెల్లిస్తోందని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్. దీంతో మిగిలిన ఫీజు కట్టలేక విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు బండి సంజయ్ కుమార్.
బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ద్రుష్టిలో ఉంచుకుని ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు  బండి సంజయ్ కుమార్. ఉమ్మడి ప్రభుత్వంలో మాదిరిగానే ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఐటీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నెం.18ను సవరించాలని కోరారు బండి సంజయ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: