బీజేపీలో తరుచూ వివాదాలకు ఆనవాలుగా నిలిచే ఎంపీ జీవీఎల్ నరసింహారావు కు పదవీ యోగం దక్కనుంది.త్వరలో పొగాకు బోర్డులో ఆయనకు సభ్యత్వం ఇవ్వనున్నారు.దీంతో ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు రానుంది.ఇప్పటిదాకా పాలక పక్షంను ఏదయినా తిట్టడమే అలవాటు చేసుకున్న జీవీఎల్ ఇప్పుడు ఎలా స్పందించబోతున్నారు.ఎవరికి ఆయన మేలు చేయబోతున్నారు అన్నవి ఆసక్తిదాయకంగా ఉన్నాయి.ఎందుకంటే బీజేపీ తరఫున పెద్దగా మాట్లాడేవారు రాష్ట్రంలో లేరు. జగన్ కు ఎదురు చెప్పి తగాదాల్లో ఇరుక్కున్న వారు అస్సలు లేరు.కనుక జీవీఎల్ ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారు.. ఏవిధంగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు.. నిరసిస్తారు అన్నది ఆసక్తిదాయకం.ఏదేమయినప్పటికీ కేంద్రంతో తరుచూ తగాదాలు పెట్టుకునే వైఖరి వైసీపీలో లేదు కనుక ఎవరికి ఏ పదవి వచ్చినా రాష్ట్రం పై వాటి ప్రభావం పెద్దగా ఉండదు కనుక జగన్ కూడా జీవీఎల్ ను ఏదో ప్రత్యర్థిలా చూడరు అన్నది వాస్తవం.
బీజేపీలో తరుచూ వివాదాలకు ఆనవాలుగా నిలిచే ఎంపీ జీవీఎల్ నరసింహారావు కు పదవీ యోగం దక్కనుంది.త్వరలో పొగాకు బోర్డులో ఆయనకు సభ్యత్వం ఇవ్వనున్నారు.దీంతో ఏపీ రాజకీయాల్లో మరో కుదుపు రానుంది.ఇప్పటిదాకా పాలక పక్షంను ఏదయినా తిట్టడమే అలవాటు చేసుకున్న జీవీఎల్ ఇప్పుడు ఎలా స్పందించబోతున్నారు.ఎవరికి ఆయన మేలు చేయబోతున్నారు అన్నవి ఆసక్తిదాయకంగా ఉన్నాయి.ఎందుకంటే బీజేపీ తరఫున పెద్దగా మాట్లాడేవారు రాష్ట్రంలో లేరు. జగన్ కు ఎదురు చెప్పి తగాదాల్లో ఇరుక్కున్న వారు అస్సలు లేరు.కనుక జీవీఎల్ ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తారు.. ఏవిధంగా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు.. నిరసిస్తారు అన్నది ఆసక్తిదాయకం.ఏదేమయినప్పటికీ కేంద్రంతో తరుచూ తగాదాలు పెట్టుకునే వైఖరి వైసీపీలో లేదు కనుక ఎవరికి ఏ పదవి వచ్చినా రాష్ట్రం పై వాటి ప్రభావం పెద్దగా ఉండదు కనుక జగన్ కూడా జీవీఎల్ ను ఏదో ప్రత్యర్థిలా చూడరు అన్నది వాస్తవం.