పదవుల విషయమై ఇప్పటికిప్పుడు ఏమీ తేలకపోయినా వైవీ లాంటి వారి హంగామా ఎప్పుడూ ఉంటుంది.రాజ్యసభ టికెట్ అన్నది ఎవరికి ఇవ్వాలో తమకు తెలుసు అని, బయట వాళ్లను పిలిచి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారు. బాగుంది..కష్టపడే వారికే పదవులు అని కూడా అంటున్నారు.ఇది ఇంకా బాగుంది.వైసీపీలో పదవులు వచ్చిన వారి జాబితాలో కులం, ప్రాంతం కాకుండా వారి కష్టానికే ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు ఎన్నో వైవీనే చెప్పాలి.
వచ్చే జూన్ లో ఖాళీ కానున్న రాజ్య సభ సీట్లకు సంబంధించి ఇప్పటి నుంచే మంతనాలు మొదలయ్యాయి.వైసీపీకి సంబంధించి పలువురు ఆశావహులు బరిలో ఉన్నారు. దీంతో వీటిని ఎవరితో భర్తీ చేస్తారో అన్న మీమాంస ఒకటి నడుస్తోంది. ఎప్పటి నుంచో రాజ్యసభకు పంపాలని శ్రీకాకుళం మహిళా నేత కిల్లి కృపారాణి విషయమై అధినేత ఆలోచిస్తున్నారు.ఆమెను రాజ్యసభకు పంపండంతో మహిళలకు సముచిత స్థానం ఇచ్చిన వాడిని అవుతానని జగన్ భావిస్తున్నారు.ఆమె అయితే దేశ రాజకీయాల్లో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించగలరని జగన్ ముందునుంచి ఓ సద్భావనతో ఉన్నారు. ఇక వైవీ కూడా రాజ్యసభ సీటే ఆశిస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి కన్నా రాజ్యసభ సీటే ముఖ్యమని పట్టుబడుతున్నారు. కానీ జగన్ ఆయన విషయమై మొదట్నంచీ సానుకూలంగా లేరు. దీంతో వైవీ ఆశలు నెరవేరేలా లేవు.