ప్రాంతీయ పార్టీల కూట‌మి కోసం కేసీఆర్ చేస్తున్న య‌త్నాల‌కు యూపీ ఎన్నిక‌లు ఓ సాకు మాత్ర‌మే. త్వ‌ర‌లో ప్రాంతీయ పార్టీల‌న్నింటినీ క‌లుపుకుని ఆయ‌నొక స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని భావించినా,త‌రువాత కాలంలో వాటి ప్ర‌భావం ఎలా ఉంటుంది అని  ఓ అంచ‌నాకు రాలేక‌పోతున్నారు కొంద‌రు.ఎందుకంటే కేసీఆర్ తాను ఎంచుకున్న పంథాకు చివ‌రిదాకా కొనసాగింపు ఇస్తార‌ని అనుకోలేం.అందుకే ప్రాంతీయ పార్టీల కూట‌మి యూపీ ఎన్నిక‌ల త‌రువాత జ‌రిగినా కూడా దాని వ‌ల్ల కేసీఆర్ కు పెద్ద‌గా మేలు ఉండదు.కానీ జాతీయ రాజకీయాల్లో త‌న ప్ర‌భావం ఎంత‌న్న‌ది బీజేపీ ఎదుట ఎంత‌న్న‌ది మాత్రం తేలిపోతుంది. అయితే ఇప్ప‌టికిప్పుడు కార్పొరేట్ శ‌క్తులు అన్నీ  మోడీ ని షాని వ‌ద‌లి కేసీఆర్ వైపు రావు క‌నుక ప్రాంతీయ పార్టీల కూటమి కార‌ణంగా బీజేపీ ఓడిపోవ‌డం అన్న‌ది పెద్ద‌గా జ‌ర‌గ‌ని మాట. కానీ ఓ చిన్న ఆశ‌తో కేసీఆర్ ప‌నిచేస్తున్నారు. ఆ ఆశ‌కు కొన‌సాగింపు ఇస్తూ కేటీఆర్ కూడా వివిధ ప్రాంతాల‌లో ప్రచారాల‌కూ,స‌మావేశాల‌కూ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. టీఆర్ఎస్ ను ఉప ప్రాంతీయ పార్టీగానే ప‌రిమితం చేశాక,ముందున్న కాలంలో జాతీయ స్థాయిలో స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం కోసం ద‌క్షిణాదితో పాటు ఇంకొన్ని ఉత్త‌రాది పార్టీల స‌హ‌కారం కావాల‌ని యోచిస్తున్నారు కేసీఆర్.రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీకి ప్ర‌త్యామ్నాయం కాలేక‌పోయినా కాస్తయినా కొన్ని స్థానాల్లో అయినా ఓట్లు చీల్చే ప్ర‌క్రియ‌కు కేసీఆర్ మ‌రియు ఆయ‌న కూటమి ముందుంటుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

బీజేపీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ త‌రువాత కూడా ఇదే హ‌వాను కొన‌సాగిస్తార‌ని అనుకుని తీర‌లేం.కానీ ఏ మాట‌కు ఆ మాట యూపీలో త‌న‌దైన ముద్ర వేయాల‌ని మాత్రం భావిస్తున్నారు.త‌ద్వారా ప్రాంతీయ పార్టీల కూట‌మికి స‌మాయ‌త్తం కావాల‌ని యోచిస్తున్నారు.ఇప్ప‌టికే యాదాద్రి ప‌నుల్లోభాగంగా బాగా బిజీగా ఉన్న కేసీఆర్ మార్చిలో యాద్రాద్రి పున‌ర్నిర్మాణం అనంత‌ర ప్రారంభోత్స‌వం అయ్యాక త‌న‌దైన వేగంతో దేశ రాజకీయాల్లో ప‌నిచేయాల‌ని యోచిస్తున్నారు.

యూపీ ఎన్నిక‌ల్లో గులాబీ దండు త‌న‌దైన ప్ర‌భావం చూపాల‌ని అనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఓ ప్ర‌ణాళిక సైతం రూపొందించి,అమ‌లు చేయాల‌ని చూస్తోంది.స‌మాజ్ వాదీ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉంటూ ఓ ప్రాంతీయ కూట‌మి ఏర్పాటుకు ఎప్ప‌టి నుంచో చేస్తున్నా ఆలోచ‌న‌కు కార్య‌రూపం ఇవ్వ‌నుంది.కేసీఆర్ ప్ర‌ధాని క‌ల నెర‌వేర‌క‌పోయినా స‌రే ...కొన్నింట అయినా టీఆర్ఎస్ త‌న ప్ర‌భావం చూపించాల‌ని భావిస్తోంది.ఇందులో భాగంగా యువ‌రాజా కేటీఆర్ సీన్ లోకి రానున్నారు.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌నలు చేయాల‌ని కేటీఆర్ భావిస్తున్నారు.వీటికి సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు. అన్నీకుదురుకుంటే కేటీఆర్ ప్ర‌చారం చేయ‌డం ఖాయం. తెలుగు మాట్లాడేవారు ఉన్న ప్రాంతాల‌లో కేటీఆర్ ప్ర‌చారం చేయ‌నున్నారని ప్ర‌ధాన స్రవంతి లో ఉన్న మాధ్య‌మం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: