డిప్యూటీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సుఖజీందర్ సింగ్ రత్వా, ఓమ్ ప్రకాశ్ సోనిరే ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న డేరా బాబా మోహల్, అమృత్ సర్ సెంట్రల్ నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీలో నిలిపింది హస్తం పార్టీ. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూ సూద్ సోదరి మాలవికాకు కూడా అసెంబ్లీ టికెట్ ఇచ్చేసింది హస్తం పార్టీ. లోథా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాలవికాకు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక యూపీలో కూడా అభ్యర్థుల ఎన్నికపై కాషాయా పార్టీ దృష్టి సారించింది. వచ్చే నెల పదవ తేదీన యూపీలోని 58 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కమలం పార్టీ. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే గోరఖ్ పూర్లో మార్చి 3వ తేదీన ఆరో దశలో పోలింగ్ జరగనుంది. యోగీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి విడతలోని 58 నియోజకవర్గాలకు గానూ 57 మంది పేర్లతో జాబితా విడుదల చేసింది కమలం పార్టీ.
డిప్యూటీ ముఖ్యమంత్రులు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సుఖజీందర్ సింగ్ రత్వా, ఓమ్ ప్రకాశ్ సోనిరే ప్రస్తుతం వారు ప్రాతినిథ్యం వహిస్తున్న డేరా బాబా మోహల్, అమృత్ సర్ సెంట్రల్ నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీలో నిలిపింది హస్తం పార్టీ. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూ సూద్ సోదరి మాలవికాకు కూడా అసెంబ్లీ టికెట్ ఇచ్చేసింది హస్తం పార్టీ. లోథా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాలవికాకు టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక యూపీలో కూడా అభ్యర్థుల ఎన్నికపై కాషాయా పార్టీ దృష్టి సారించింది. వచ్చే నెల పదవ తేదీన యూపీలోని 58 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది కమలం పార్టీ. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే గోరఖ్ పూర్లో మార్చి 3వ తేదీన ఆరో దశలో పోలింగ్ జరగనుంది. యోగీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొదటి విడతలోని 58 నియోజకవర్గాలకు గానూ 57 మంది పేర్లతో జాబితా విడుదల చేసింది కమలం పార్టీ.