బొంగురు గొంతులో ఈ పాత్రను రక్తి కట్టిస్తారు. ఈ చింతామణి నాటకం ఆంధ్రదేశంలో చాలా ఫేమస్.. అయితే.. చింతామణి నాటకంలోని సుబ్బి శెట్టి పాత్ర పై మొదటి నుంచి కూడా వైశ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నాటకం బహుళ ప్రజాదరణ పొందడంతో ఆ పాత్రను ఏమీ చేయలేకపోయారు ఇప్పటి వరకూ. అంతే కాకుండా సీరియస్గా సాగే నాటకంలో సుబ్బిశెట్టి పండించే హాస్యం నాటకం విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే.. ఇప్పుడు ఎన్నాళ్ల నుంచో ఈ నాటకాన్ని నిషేధించాలన్న వైశ్యుల డిమాండ్ను ఇప్పుడు జగన్ ప్రభుత్వం నెరవేర్చింది. వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించాలని నిర్ణయించింది. ఆర్యవైశ్య సంఘాలు ఈ విషయంపై గతంలో చాలాసార్లు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశాయి. అయితే.. గత పాలకులు ఈ విజ్ఞాపనలను పెద్దగా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఏ స్థాయిలో పరపతి ఉపయోగించారో లేదా.. జగనే వారి విజ్ఞప్తి సమంజసం అనుకున్నారో తెలియదు కానీ.. మొత్తానికి ఏపీలో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతామణి నాటకం ఏపీలో ప్రదర్శించకుండా తక్షణం చర్యలు చేపట్టాలని సాంస్కృతిక శాఖను అదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.