ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి... ఈ విషయంపై కూడా ఆచితూచి వ్యవహరించారు. ఒక దశలో తాను పెద్దను కాదని... ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్లే పరిస్థితి లేదన్నారు చిరంజీవి. అయితే... సడన్గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు చిరంజీవి. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న చిరంజీవి... నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. కాసేపు మాట్లాడారు. టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల వ్యవహారంపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు పరిశ్రమ నుంచి వస్తున్న విమర్శలకు బ్రేక్ పడింది. టికెట్ల వ్యవహారంపై సినీ హీరోల కామెంట్లకు చెక్ పెట్టే బాధ్యతను చిరంజీవికి అప్పగించారు చిరంజీవి. దీంతో టాలీవుడ్ నుంచి ఎవరూ ఈ విషయంపై మాట్లాడవద్దని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా టాలీవుడ్ నుంచి వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్న హీరోల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి... ఈ విషయంపై కూడా ఆచితూచి వ్యవహరించారు. ఒక దశలో తాను పెద్దను కాదని... ఇద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో వెళ్లే పరిస్థితి లేదన్నారు చిరంజీవి. అయితే... సడన్గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు చిరంజీవి. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న చిరంజీవి... నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. కాసేపు మాట్లాడారు. టికెట్ల ధరలు, బెనిఫిట్ షోల వ్యవహారంపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే.. పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు పరిశ్రమ నుంచి వస్తున్న విమర్శలకు బ్రేక్ పడింది. టికెట్ల వ్యవహారంపై సినీ హీరోల కామెంట్లకు చెక్ పెట్టే బాధ్యతను చిరంజీవికి అప్పగించారు చిరంజీవి. దీంతో టాలీవుడ్ నుంచి ఎవరూ ఈ విషయంపై మాట్లాడవద్దని చిరంజీవి సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా టాలీవుడ్ నుంచి వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్న హీరోల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.