జనం బాట ఎప్పుడు..?
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అసలు తన పాలన ఎలా ఉంది, జనం ఏమనుకుంటున్నారు.. ఏమేం మార్పులు చేసుకోవాలి. వచ్చేసారి కూడా అధికారంలోకి రావాలంటే ముందున్న కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. సగటు నాయకుడెవరైనా ఇదే ఆలోచిస్తారు. అలా ఆలోచించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి జగన్ ఏం ఆలోచిస్తున్నారు..? ఎప్పుడు జనాల్లోకి వస్తారు..?
తన తండ్రితో ఆగిపోయిన రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టాలనేది సీఎం జగన్ ఆలోచన. కానీ దానికి ఇప్పటికే చాలాసార్లు బ్రేక్ పడింది. కరోనా వల్ల రచ్చబండ అలా మొదలవుతుందనుకున్న టైమ్ లో ఇలా ఆగిపోయేది. అయితే ఎన్నికల లోగా జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టాల్సిందేనంటున్నాయి పార్టీ శ్రేణులు. జగన్ తన పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని స్వయంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఒకరకంగా పార్టీనుంచే కాదు, ప్రజల నుంచి కూడా జగన్ పై ఆ ఒత్తిడి ఉంది. మరి ప్రజా బాట మరోసారి ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.