పొలిటికల్ మేలేజ్ కోసమా?
విభిన్న వాతావరణంలో విభిన్న వాదనల నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ ఎప్పటికప్పుడు వివాదాల్లో ఉంటూనే ఉన్నారు. నరసరావు పేట ఎంపీ స్థానానికి ఎన్నికయిన నాటి నుంచి నేటి వరకూ జగన్ తో తగువు పెట్టుకోనిదే ఆయనకు ఆత్మశాంతి దక్కడం లేదు.ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేయడంతో వైసీపీ కూడా విసిగిపోయి ఆయన గురించి మాట్లాడడమే మానుకుంది.మౌనంగా ఉంటూ ఆయనేం చేస్తారో చూడాలన్న అంచనాకు వచ్చేసింది కూడా! తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు తనకో అవకాశం దొరికిందని సంబరపడిపోతున్నారు రెబల్ ఎంపీ.దీంతో పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని కూడా చూస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే....
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఇటీవలే రాజీనామా ప్రకటన చేసి హల్ చల్ చేసిన రఘురామ కొత్తగా మరో గొంతుక అందుకున్నారు.తాను ఉద్యోగుల కోసం ఒక రోజు దీక్ష చేస్తానని చెప్పి సెన్సేషన్ అయ్యారు.ఇప్పటికే జగన్ పై కారాలూ మిరియాలూ నూరుతున్న రఘురామ తాజాగా ఉద్యోగుల సమస్య ఎత్తుకుని వారి నుంచి సానుభూతి పొందేందుకు చేస్తున్న ఎత్తుగడ ఇది అని వైసీపీ అంటున్నా..ఆయన అవేవీ పట్టించుకోరు.ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని, కొత్త జీఓ కారణంగా వారికి వేతనాల్లో నష్టం తప్పదని,వీటిని నిరసిస్తూ తాను ఉపవాస దీక్ష చేపడతానని అంటున్నారీయన.