ఈ కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకారి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారు.. బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల ఓమిక్రాన్ ఎంతో సమర్థవంతంగా పోరాటం చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు పరిశోధకులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా దేశాలలో బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్లో అయితే ఏకంగా నాలుగవ డోస్ కూడా ప్రజలకు అందిస్తూ ఉండడం గమనార్హం.. ఇక అదే సమయంలో ఓమిక్రాన్ ఎంత ప్రమాదకారి ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నాలుగవ డోస్ టీకా తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ నుంచి మాత్రం పాక్షికంగా మాత్రమే రక్షణ కల్పించబడుతుంది అంటూ ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయం పరిశోధనల్లో వెల్లడయింది అంటూ చెప్పుకొచ్చారు. సెబా మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి పరిశోధనలు జరిపి టీకాలు సురక్షితం సమర్థతను పరిశీలించారు. ఈ క్రమంలోనే బూస్టర్ డోసు కూడా తీసుకున్న వారికి నాలుగవ డోస్ చేశారు. భిన్నమైన వ్యాక్సిన్లు ఇచ్చి పరిశోధన జరిపారూ. నాలుగు డోస్ ఇచ్చిన తర్వాత బాడీలో యాంటీబాడీలు పెరిగినప్పటికీ అవి ఓమిక్రాన్ నుంచి పాక్షికంగానే రక్షణ కల్పిస్తున్నాయి అన్న విషయాన్ని గుర్తించారు.