రాబోయే ఎన్నికల్లో విజేత ఎవరో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పేశారా ? ఆయన మాటలు విన్న తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆయన చెప్పిందేమంటే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డే గెలుస్తారని చెప్పారు. జగన్ గెలుపుకు ప్రధాన కారణం ఏమిటంటే అమలు చేస్తున్న సంక్షేమపథకాలేనట.




ఇపుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ 2024 వరకు అమలు చేయగలిగితే మళ్ళీ జగన్ దే గెలుపనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. కరోనా వైరస్ కష్టకాలంలో జగన్ ప్రభుత్వం పేదలను ఆదుకున్నట్లు ఇంకే ముఖ్యమంత్రి ఆదుకోలేదన్నారు. ఈమధ్య రెగ్యులర్ గా జగన్ ప్రభుత్వంలోని తప్పులను, వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేస్తున్న ఉండవల్లి తాజా వీడియా బాగా వైరల్ అయ్యింది. పేదల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయటం ద్వారా సమాజంలో అస్తిరత రాకుండా జగన్ జాగ్రత్త పడినట్లు కితాబిచ్చారు.




పేదల ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు వేయటం ద్వారా ఆర్ధికంగా చేయూత ఇచ్చినట్లయ్యిందన్నారు. ప్రంపచంలోని ఆర్ధిక వేత్తలందరు కూడా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయమని చెబుతున్నదాన్నే జగన్ ఆచరణలో చేసి చూపించినట్లు ఉండవల్లి చెప్పారు. పేదల ఖాతాల్లో జగన్ వేసిన డబ్బంతా ఏదో రూపంలో సర్క్యులేట్ అవుతు మళ్ళీ ప్రభుత్వం దగ్గరకే వచ్చిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు.




కరోనా వైరస్ సమస్యను కూడా జగన్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారన్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రయినా చేయగలిగేది కూడా లేదన్నారు. కరోనా వైరస్ వల్లే నరేంద్రమోడీకి బాగా మైనస్ అయితే అదే కరోనా సమస్య జగన్ బాగా ప్లస్ అయ్యిందన్నారు. కరోనా కాలంలో పేదల ఖాతాల్లో డబ్బులు వేయటం ద్వారా వాళ్ళ జీవితాలు దిగజారిపోకుండా జగన్ కాపాడినట్లు మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం నుండి ప్రజలను గట్టెక్కించటం వల్లే జగన్ ఇమేజీ బాగా పెరిగిపోయిందని ఉండవల్లి అభప్రాయపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: