తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ..గతంలో వైసీపీలో పనిచేశారు. ఇంకా ప్రభుత్వ సర్వీసు ఉన్నా సరే జగన్ టిక్కెట్ ఇస్తానని అన్నారని చెప్పి, ఉద్యోగం వదిలేసి మరీ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్గా పనిచేశారు. కానీ నిదానంగా పితానిని సైడ్ చేసి పొన్నాడ సతీశ్ని ముందుకు తీసుకొచ్చారు. దీంతో ముమ్మిడివరం సీటు తనకు దక్కదని పితానికి అర్ధమైంది.
అయితే ఇక్కడ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం చాలా కష్టం...అదే సమయంలో టీడీపీ గెలవడం కూడా కష్టమే. గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్లే ముమ్మిడివరంలో టీడీపీ 5 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఈ సారి అలా జరగకుండా ఉండాలంటే రెండు పార్టీలు కలవాలి. కాకపోతే సీటు జనసేన గాని దక్కించుకుంటే ఖచ్చితంగా పితానికి లక్కీ ఛాన్స్ దక్కినట్లే అని చెప్పొచ్చు. మరి చూడాలి పితానికి లక్కీ ఛాన్స్ దక్కుతుందో లేదో?