అనంతపురం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి షాకింగ్  కామెంట్స్ చేశాడు. ప్రజల కోర్కెలు తీర్చడం లో... ఆర్థిక పరిస్థితి ని చక్కదిద్దడం, అభివృద్ధి విషయం లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని నిప్పులు చెరిగారు.  రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని.. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికి... సీఎం లుగా ఇక్కడివారు ఉన్నా అభివృద్ధి మరిచారని మండిపడ్డారు.  ఆర్థిక వనరులు ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారని.. 2024 లో బీజేపీ అధికారంలోకి వచ్చి రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తామన్నారు.  రైల్వే ప్రాజెక్టులకు రాష్ర్టం నిధులు ఇవ్వకున్న మేము పూర్తి చేస్తామని.. కడప, కర్నూలు లో మోడీ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ లు నిర్మిస్తే... రాష్ట్ర ప్రభుత్వం బస్టాండులు ప్రయివేటు పరం చేస్తుందన్నారు.  సర్పంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. ఎన్ ఆర్ ఈ జె ఎస్ నిధులు దారి మళ్లించారు... రాష్ట్రంలో అధికారం లో ఉన్న వారు మట్టి, ఇసుక అమ్ముకుంటున్నారని నిప్పులు చెరిగారు. 

పోలవరం తప్ప తెలుగు గంగ, హంద్రీనీవా అక్కరలేదా ఎందుకు వీటిపై రెండు పార్టీలు మాట్లాడవు... రాష్ట్రంలో కేవలం మోడీ ప్రభుత్వ నిధులతో నే అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. సిమెంటును రూ. 330 కి ఎందుకు అమ్ముతున్నారు... బిజెపి అధికారంలోకి వస్తే రూ. 200 ఇస్తామని ప్రకటన చేశారు.  పిల్లలకు సరైన కోడిగుడ్లు ఇవ్వలేని పార్టీ అధికారం లో ఉందని.. బిజెపి అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో కోళ్లఫారం పెట్టి నాణ్యమైన నాటు కోడిగుడ్లు సరఫరా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని భవిష్యత్తు లో పోరాటం చేస్తామని.. కర్నూలు జిల్లా అధ్యక్షుడు బడ్డా శ్రీకాంత్ రెడ్డి పై దాడి కి నిరసనగా ఈనెల 22 న 175 నియోజకవర్గాల్లో ప్రజా నిరసన సభ లు నిర్వహిస్తున్నామన్నారు.  రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై దాడి చేస్తే అడిగే దిక్కులేదని.. మసీదులు కట్టడం, టిప్పు విగ్రహ ఏర్పాటు... రాముడి శిరక్షేధనం.. రథం తగలబడడం వంటివి జరిగితే అడిగేవారు లేరని అగ్రహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: