తెలుగు సినిమా నటి శ్రీ రెడ్డి కొంతమంది నటుల మీద బూతులతో రెచ్చిపోతూ తీవ్రమైన విమర్శలు చేసింది.ఇంకా బూతులతో మాటల దాడి కొనసాగిస్తున్నది. బయట అర్ధనగ్న ప్రదర్శనకూ కూడా వెనుకాడలేదు. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీపై ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్లను తీవ్రమైన పదజాలంతో ఆమె టార్గెట్ చేసి పచ్చి బూతులు తిడుతుంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా బూతులతో ప్రత్యర్థి నాయకులపై ఆమె విరుచుకుపడుటుంది.దీంతో శ్రీ రెడ్డి వైసీపీ అధికార ప్రతినిధినా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా ఇష్టమొచ్చినట్లు బూతులతో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి .. ఇప్పుడు కూడా పవన్ ని లక్ష్యంగా చేసుకుని బూతులు మాట్లాడుతూనే వుంది. ఇక టీడీపీకి చెందిన ఎవరైనా నాయకులు జగన్ను విమర్శిస్తే ఆమె రంగంలోకి దిగుతుంది.బూతులతో రెచ్చిపోతుంది.

 ఇక ఇప్పుడు తాజాగా తన స్థాయిని దాటి ఆమె టికెట్ల వ్యవహారంలో సినిమా పెద్దల మీద కూడా విరుచుకుపడుతుంది. శ్రీ రెడ్డి ఏదో పెద్ద స్టార్ అన్నట్లు పద్ధతి లేకుండా విచక్షణ మరిచి మాట్లాడుతున్నది అనే టాక్ వినిపిస్తోంది.యూట్యూట్ వీడియోలు చేసుకుంటూ ఆమె వైసీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఓ వైపు జగన్ మీద విమర్శకులకు శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతుంటే.. ఆ పార్టీ నాయకులు మాత్రం శ్రీ రెడ్డి తీరుతో నెత్తి కొట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఆమె తమ పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకులే అంటున్నారని సమాచారం.శ్రీ రెడ్డి పార్టీకి మద్దతుగా మాట్లాడితే సరే కానీ తాను ఉపయోగిస్తున్న భాషతో చెడ్డపేరు వస్తుందని నాయకులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది.శ్రీ రెడ్డి పార్టీ గురించి మాట్లాడితే చెడ్డ పేరు వస్తుంది తప్ప కలిగే ప్రయోజనం ఏమీ లేదని అంటున్నారు. శ్రీ రెడ్డి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో శ్రీరెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: