ప్రస్తుతం సర్వత్రా ఒకటే అంశంపై చర్చ. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు. ఎవరి నాయకత్వానికి మద్దతు ఇస్తారు. ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందా... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ఇవే ప్రశ్నలు... ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జవాబు ఇస్తోంది. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం సర్వే చేసిన ఇండియా టుడే సంస్థ పనిలో పనిగా... సాధారణ ఎన్నికలపై కూడా సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేల్చేసింది. మొత్తం 543 స్థానాలున్న లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 296 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూడా తమ బలాన్ని పెంచుకుంటుందని తేలింది. యూపీఏ 127 స్థానాలో సరిపెట్టుకుంటుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సర్వత్రా ఒకటే అంశంపై చర్చ. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది. ప్రజలు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు. ఎవరి నాయకత్వానికి మద్దతు ఇస్తారు. ఎన్డీయే ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందా... కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా.. ఇవే ప్రశ్నలు... ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఇండియా టుడే సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే జవాబు ఇస్తోంది. వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం సర్వే చేసిన ఇండియా టుడే సంస్థ పనిలో పనిగా... సాధారణ ఎన్నికలపై కూడా సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేల్చేసింది. మొత్తం 543 స్థానాలున్న లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 296 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూడా తమ బలాన్ని పెంచుకుంటుందని తేలింది. యూపీఏ 127 స్థానాలో సరిపెట్టుకుంటుందని స్పష్టం చేసింది.